English | Telugu

యావర్ కి గిఫ్ట్ తెచ్చిన శోభాశెట్టి అమ్మ!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పుడు మరింత క్రేజ్ ని తెచ్చుకుంటుంది. దానికి కారణం ఫ్యామిలీ వీక్. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఆటతీరుతో, మాటతీరుతో ఆకట్టుకుంటుండగా.. బిగ్ బాస్ రోజుకో ట్విస్ట్ ఇస్తూ మరింత హైప్ తీసుకొస్తున్నాడు.

ఫ్యామీలీ వీక్ లో భాగంగా ఈ రోజు మొదటి ప్రోమోలో అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ వచ్చినట్టు బిగ్ బాస్ చూపించారు. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన రెండవ ప్రోమోలో శోభాశెట్టి వాళ్ళ అమ్మ హౌస్ లోకి వచ్చింది. " అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి " సినిమాలోని అమ్మ పాటని బిజిఎమ్ గా వేసి మరింత ఆసక్తిగా మలిచారు బిగ్ బాస్ మేకర్స్. తల్లిని చూసిన శోభాశెట్టి తల్లడిల్లిపోయింది. కొన్ని రోజులుగా ఫ్యామిలీని బాగా మిస్సింగ్ అంటు శోభాశెట్టి అంటుంది.

ఇప్పుడు కన్నతల్లిని చూడగానే శోభాకి కంటనీరు ఆగలేకపోయాయి. అయితే యావర్ కోసం శోభాశెట్టి వాళ్ళ అమ్మ ఒక బహుమతి తీసుకొచ్చింది. యావర్ తల్లి చనిపోయింది. అందుకే నిన్న గౌతమ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు యావర్ బాగా ఏడ్చేసాడు. ఇప్పుడు కూడా ఎమోషనల్ అయిన యావర్ కి.. కొంగులో దాచిన యావర్ తల్లి ఫోటోని ఇచ్చింది శోభాశెట్టి అమ్మ. ఆ ఫోటోని చూడగానే యావర్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు.

శివాజీ చూసి అమ్మ వచ్చింది యావర్ అనగానే.. మరింత ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత శోభాశెట్టి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడ్డాడు యావర్. నేను కూడా మీ అమ్మనే అంటూ శోభాశెట్టి వాళ్ళ అమ్మ అంది. కాసేపటికి హౌస్ మేట్స్ అంతా యావర్ ని ఓదార్చారు. ఇప్పుడు యావర్ కోసం బిగ్ బాస్ పంపించిన గిఫ్ట్ తో ఈ ఎపిసోడ్ మరింత ఎమోషనల్ గా మారనుంది. అయితే శోభాశెట్టి వాళ్ళ అమ్మ శోభాకి కొన్ని సలహాలిచ్చినట్టు తెలుస్తుంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.