English | Telugu

15 ఇయర్స్ అయ్యిందా పెళ్ళై.. డాక్టర్ బాబుని ఆడుకున్న రవితేజ!

కొత్త ఏడాది వచ్చిందంటే చాలు సంక్రాంతి కూడా వచ్చేసినట్టే. సంక్రాంతి వస్తుందంటే చాలు బుల్లితెర మొత్తం కొత్త కొత్త షోస్, ఈవెంట్స్ తో కళకళలాడిపోతుంది. ఈ నేపథ్యంలో ఈటీవీలో "సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం" టైటిల్ తో ఒక ఎపిసోడ్ రాబోతోంది. యాంకర్ సుమ ఈ షోని నిర్వహించబోతున్నారు. "ఈటీవీలో ఈ పండగ మీ ఇంటి పండగలా ఉండబోతోంది. పందెం కోళ్ల లాంటి పవర్ఫుల్ పెర్ఫార్మెన్సులతో ఈ సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం" అంటూ చెప్పారు.

ఇందులో ఆది ఫైర్ స్టార్మ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోంది. బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ మూవీ జానీలో సాంగ్ ప్లే అవుతుంటే ఆయన లేటెస్ట్ మూవీ ఓజిలోని వాషి యో వాషి అంటూ డైలాగ్ చెప్పేసరికి నాగబాబు కూడా పగలబడి నవ్వేశారు.

తర్వాత మాస్ మహారాజ రవితేజ వచ్చారు. "భార్యను ఇంప్రెస్ చేయడానికి భర్త ఎలాంటి గిఫ్ట్ లు ఇస్తే బాగుంటుంది" అంటూ కార్తీక దీపం డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల రవితేజను అడిగాడు. "ఎన్నాళ్ళయింది పెళ్ళై నీకు" అని రవితేజ అడిగారు. 15 ఇయర్స్ అని చెప్పాడు నిరుపమ్. " 15 ఇయర్స్ అయ్యిందా. ఇంకా గిఫ్ట్ ల గురించి మాట్లాడుతున్నాడేమిటి ?" అంటూ రివర్స్ లో అడిగేసరికి అక్కడే ఉన్న అనిల్ రావిపూడి "అంతేగా అంతేగా" అంటూ ఫన్నీ డైలాగ్ వేసాడు. ఇక ఈ ప్రోగ్రాం సంక్రాంతి రోజు ఉదయం 10 గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.