English | Telugu

బీబీ జోడీస్ మధ్య ఫైట్...ఫైర్ ఐన జడ్జెస్...నేను ఇంక ఈ షో చేయను!

బీబీ జోడి ప్రతీ వారం ఏదో ఒక కాంట్రావర్సీతో ఆడియన్స్ అటెంషన్ ని తమ వైపు తిప్పుకుంటోంది. రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ థీమ్ "డైరెక్టర్స్ స్పెషల్".

ఇక ఇందులో ఒక్కో పెయిర్ డాన్స్ ని ఇరగదీశారని చెప్పాలి. మెహబూబ్ – శ్రీ సత్య ఇద్దరూ డైరెక్టర్ త్రివిక్రమ్ స్పెషల్ అని చెప్పి రోబోటిక్ పెర్ఫార్మెన్స్ చేసి చూపించారు. ఐతే ఆరియానా వీళ్ళ డాన్స్ మీద రియాక్ట్ అయ్యింది.."త్రివిక్రమ్ గారికి డేడికేట్ చేస్తున్నామన్నారు..కానీ మాకు శంకర్ గారి రోబో కనెక్ట్ ఐన ఫీల్ వచ్చింది" అంది. "నేను కూడా త్రివిక్రమ్ అంటే వేరే ఎక్స్పెక్ట్ చేసాను" అంది భానుశ్రీ.."త్రివిక్రమ్ స్టైల్ అంటే ఎట్లా ఉండాలని మీ ఆలోచన" అని వెంటనే సదా అడిగేసింది. "త్రివిక్రమ్ స్టైల్ అంటే ఆలా వైకుంఠపురం స్టైల్" అని అవినాష్ చెప్పాడు. "మెడ్లే ఉండాలి మేడం నాలుగు పార్టులు తీసుకుని కొట్టేస్తే అదే డాన్స్ మేడం...కానీ త్రివిక్రమ్ గారు ఒక వేళ ఇది చూస్తే నా సాంగ్ కి రోబోలా బాగా చేశారురా అనిపించాలి కదా మేడం" అని మెహబూబ్ కన్విన్సింగ్ గా చెప్పాడు. "కొట్టేవాళ్ళు చప్పట్లు కొడుతున్నారు మా దాంట్లో పాయింట్స్ లేవా అండి...ఎందుకు ఒక పాయింట్ లో పెట్టేసి, కొట్టేసి, హైప్ ఇచ్చేసి..వాట్ ఐస్ థిస్ " అని ఫైర్ అయ్యింది ఆరియానా. ఇంతలో పక్కనుంచి భానుశ్రీ ఏడ్చేసింది. ఎందుకు ఏడ్చిందో తెలీదు.

తర్వాత అర్జున్ కళ్యాణ్ - వాసంతి టీం హాట్ పెర్ఫార్మెన్స్ చేశారు. డాన్స్ ఐపోయాక "రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ కాబట్టి నాకు ఇంకొంచెం డాన్స్ మూవ్మెంట్స్ ఉంటే లిఫ్టింగ్ లు, రొమాంటిక్ స్టెప్స్ ఉంటే" అన్నాడు అవినాష్. "మీకు ఎవరు చెప్పారు ఇది డాన్స్ కాదు అని" అని సదా ఫైర్ అయ్యింది. తర్వాత ఆరియానా-అవినాష్ జోడి మధ్య వార్ జరిగింది. " మీరు పదికి పది మార్కులు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. నేను ఇంక ఈ షో చేయను" అని అవినాష్ మైక్ అక్కడ పెట్టేసి షోలోంచి లేచి వెళ్ళిపోయాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.