English | Telugu

ప్రేమ-పగ సినిమాలో సావిత్రి గారితో నటించా...ఆమెను చూసి కన్నీళ్ళొచ్చేసాయి

ఋతురాగాలు సీరియల్ లో నటించిన రూప దేవి అలియాస్ శారద అంటే చాలు ఎవ్వరికైనా గుర్తొచ్చేస్తుంది. అసలు ఈ సీరియల్ ఇప్పుడు టెలికాస్ట్ ఐనా కూడా చూడని వారంటూ ఎవరూ ఉండరు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ లవ్ స్టోరీ. ఇక రూపాదేవి నటన గురించి చెప్పాలంటే పీక్స్..ఎక్కువ తక్కువ కాకుండా మొత్తం బాలన్స్ గా నటిస్తారు. అలాంటి రూపాదేవి మహానటి సావిత్రి గారి గురించి కొన్ని కామెంట్స్ చేసారు. " మహానటి సావిత్రి గారు రియల్ లైఫ్ లో ఎప్పుడూ దర్పం చూపించుకునే వారు కాదు. ఎవరం వెళ్లి మాట్లాడినా కూడా మరీ ఎక్కువగా కాదు తక్కువగా కాదు బ్యాలన్సుడ్ గా మాట్లాడేవారు.

బాలకృష్ణ నటించిన ప్రేమ - పగ అనే మూవీలో నేను సావిత్రి గారితో కలిసి ఒక సీన్ చేశా. కానీ అప్పటికే ఆమె ఇండస్ట్రీలో మాలాంటి వారందరికీ ఒక చాఫ్టర్ లాంటి వారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరంగా చాలా పాడైపోయారు. ఐతే తమిళ్ లో ఋతురాగాలు చేస్తున్నప్పుడు ఆమె మంచం పట్టారు. నేను ఒక రోజు చూడడానికి వెళ్లాను. అప్పుడు జెమినీ గణేశన్ గారు అక్కడే ఉన్నారు. ప్రేమ - పగ మూవీ అప్పట్లో పెద్ద హిట్. నా క్యారెక్టర్ కి కూడా మంచి పేరు వచ్చింది. నేను వెళ్ళినప్పుడు సావిత్రి గారికి నేనొచ్చిన విషయాన్నీ చెప్పారు. కానీ ఆమె కోమాలో ఉన్నారు. అంత భారీ ఖాయంతో ఎంతో అందంగా కళ్ళతో నటించే సావిత్రి గారు చిన్న పిల్లలా మారి మంచం మీద ఉండడం చూసాక నాకు చాలా బాధగా అనిపించింది. ఆమె కాళ్లకు దణ్ణం పెట్టుకుని ఇంటికి వచ్చి బాధపడ్డాను, నాకు ఏడుపాగలేదు. ఇప్పుడు డయాబెటిక్ పేషంట్స్ కి అవేర్నెస్ అనేది ఉంది కానీ అప్పట్లో అంతగా తెలీదు. ఆ తర్వాత సావిత్రి గారు ఒక రెండు నెలల తర్వాత పోయారు. చివరి రోజుల్లో జెమినీ గణేష్ గారు చూసుకున్నారు. మహానటి మూవీలో చూపించిన ఒక మీడియం హౌస్ లోనే ఆమె ఉన్నారు. అసలు ఆవిడ చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండేవారు. పాపం అని పిలిచి ఆ రోల్ ఇచ్చినట్టు ఉన్నారు ఆ సినిమాలో. సెట్ లో ఎంతమంది కొత్తవాళ్లు ఉన్నా కూడా ఆవిడ తన పని తానూ చూసుకునేవారు. మేమంతా వెళ్లి ఆమె బ్లేసింగ్స్ తీసుకునేవాళ్ళం. సెట్ అందరితో చాలా బాగుండేవాళ్లు. మరీ ఓవర్ ఫ్రెండ్లిగా లేరు అలాగని మాట్లాడకుండా కూడా ఉండరు. నేనొక పెద్ద హీరోయిన్ అనే గర్వం కూడా ఆమెకు ఉండేది కాదు. " అని చెప్పుకొచ్చింది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.