English | Telugu

రోజా లేకపోతే మా ల‌వ్ స్టోరీ స్క్రీన్ మీదకు వచ్చేది కాదు!

బుల్లితెర మీద ఈమధ్య రియాలిటీ షోస్ ఎక్కువయ్యాయి. వీటికి టీఆర్పీలు పెంచుకోవడానికి రీల్ లవ్ స్టోరీస్ ని వండి వడ్డిస్తున్నారు ఆడియన్స్ కి. అలాంటి ఒక రీల్ లవ్ స్టోరీ గురించి అనుకోగానే ముందుగా గుర్తొచ్చేది రష్మీ-సుధీర్ లవ్ స్టోరీ. ఐతే రీల్ లవ్ స్టోరీస్ మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటు రియల్ లవ్ స్టోరీస్ కూడా ఉంటాయని నిరూపించారు రాకేష్ అండ్ జోర్దార్ సుజాత.

మొదట్లో వీళ్ళ లవ్ స్టోరీ అందరిలాంటిదే అనుకున్నారంతా. కానీ 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టారు. వెంటనే సుజాతకు రింగ్‌ తొడిగి ప్రపోజ్ చేసి తమదినిజమైన ప్రేమ అని చెప్పాడు రాకేశ్‌. త్వరలోనే తామువివాహం చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించింది సుజాత. దీని గురించి తన యూట్యూబ్‌ చానెల్‌లో కూడా చెప్పింది. ఐతే వీళ్ళ ప్రేమ, పెళ్ళికి కారణం జబర్దస్త్ జడ్జి రోజా అని చెప్పింది సుజాత.

లేటెస్ట్ గా తన యూట్యూబ్‌ చానెల్‌లో రోజా హోమ్‌ టూర్‌ వీడియోను అప్‌లోడ్‌ చేసింది సుజాత. ఆ వీడియోలోతాను, రాకేష్‌ ప్రేమించుకుంటున్నాం అనే విషయాన్ని ముందుగా రోజా గుర్తించారని తెలిపింది సుజాత. తర్వాత ఆమె ఇద్దరితో మాట్లాడినట్టు చెప్పింది సుజాత. "రోజా గారు లేకపోతే మా విషయం స్క్రీన్ మీదకు వచ్చేది కాదు.. మా పెళ్లి అనౌన్స్మెంట్ కూడా ఇంత తొందరగా వచ్చేది కాదు. మా ప్రేమకు కారణం రోజాగారే" అని చెప్పింది సుజాత. జబర్దస్త్ లో మనో, రోజా, ఖుష్బూ అంటే ఇష్టమని చెప్పింది. త్వరలో మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యాక అనౌన్స్ చేస్తామని చెప్పింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.