English | Telugu

గెలిచిన లక్షని తన యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ కే అన్న రష్మీ...

సిక్స్త్ సెన్స్ సీజన్ 6 ఈ వారం భలే హుషారుగా సాగింది. ఇందులో రష్మీని కొన్ని ప్రశ్నలు వేసాడు ఓంకార్. "ఒక ఐలాండ్ లో ఉండిపోతే నీకు కంపెనీ ఎవరు ఉంటే బాగుంటుంది" అనుకుంటారు అనేసరికి "సుధీర్ ఉంటే బాగుండు" అని అనుకుంటాను అని చెప్పింది. తర్వాత "మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగేసరికి నేను బ్రహ్మాజీ గారు బాయ్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్" అని చెప్పింది..."మీ బాయ్ ఫ్రెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటి .." అంటే ఏం చెప్తారు అని ఓంకార్ అడగడంతో "మనిషి కన్ఫ్యూషన్ లో ఉండకూడదు..ఏది అనుకుంటాడో అదే చెప్పాలి..అదే చేయాలి... అదే ముఖ్యమైన క్వాలిటీ ..." అని చెప్పింది. " మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అంటే ఏం చేయాలి" అని అడిగేసరికి " ఒక స్ట్రీట్ యానిమల్ ని అడాప్ట్ చేసుకోవాలి. నా గుడ్ బుక్స్ లో రావాలి అంటే అదే చాలా తేలికైన దారి. వైజాగ్ లోని దువ్వాడలో ఒక యానిమల్ షెల్టర్ కట్టాను. అది పూర్తిగా కాలేదు ఇంకా.

ఐతే ఈ రెండు మూడేళ్ళలో దాని మీద ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టాలి అనుకుంటున్నా..ఐతే ఆ షెల్టర్ లో మాత్రం 14 వీధి కుక్కలు ఉన్నాయి" అని చెప్పింది. తర్వాత గేమ్ లో భాగంగా ఎగ్ బ్రేక్ చేసి లక్ష రూపాయలు గెలుచుకుంది రష్మీ. ఈ డబ్బులు నా బంబుల్ బడ్డి యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కి ఖర్చు చేస్తాను అని చెప్పింది. అలాగే తన గేమ్ లో భాగంగా తనకు అవసరమైన సలహాలు ఇచ్చినందుకు బ్రహ్మాజీకి ఆ లక్ష రూపాయల్లో సగం ఇస్తాను అని ఒప్పుకుంది రష్మీ. ఇలా ఈ గేమ్ పూర్తి చేసింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.