English | Telugu

రేవతిగారితో నటించిన మూవీ రిలీజ్ కాలేదు.. 

సిల్వర్ స్క్రీన్ మీద రాజా రవీంద్ర ఎన్నో మూవీస్ లో ఎన్నో రోల్స్ లో నటించాడు. ఆయన జర్నీ చాలా సుదీర్ఘమైనది. ఇప్పటికీ ఎన్నో మూవీస్ లో నటిస్తున్నాడు. రీసెంట్ గా అయన కాకమ్మ కథలో ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. "నేను కూచిపూడి డాన్స్ నేర్చుకోవడానికి చెన్నై వచ్చాను. నేను మెస్ లో భోజనం చేస్తున్నప్పుడు ఒకాయన వచ్చి ఇలా రేవతి గారితో ఒక మూవీ చేస్తున్నారు. హీరో కోసం వెతుకుతున్నారు. మీరు చేస్తారా అని అడిగారు. నేను హీరో ఏంటి అనేసరికి లేడు రండి అని నన్ను తీసుకెళ్లారు. మేము వెళ్లేసరికి డైరెక్టర్ గారు. అప్పట్లో నా అసలు పేరు రమేష్. నేను విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చాను. అప్పట్లో ల్యాండ్ ఫోన్ ఉంది. రెండో రోజు ఫోన్ చేసి పిలిస్తే వెళ్లాను. చూసి ఎవడ్రా నువ్వు అన్నారు. సాంబశివరావు అని ఈనాడు అవి తీశారు కృష్ణ గారితో. నేనే సర్ రమేష్ ని అన్న. ఓరిని రమేష్ అరవింద్ అనుకున్న రమేషా నువ్వు అన్నారు. సరే బానే ఉన్నావ్ గాని రా అని రేవతి గారి దగ్గరకు తీసుకెళ్లారు. హీరోగా వీడు ఓకేనా అని అడిగారు. అప్పటికే ఆవిడ నేషనల్ అవార్డు అందుకున్న పెద్ద ఆర్టిస్ట్.

అంటే కొత్తవాళ్లతో చేస్తారా లేదా అని అడగడానికి తీసుకెళ్లారు. తర్వాత ఆవిడ తన క్యారక్టర్ బాగుంది అలాగే నేను కూడా బాగున్నాను అనేసరికి కెమెరా మ్యాన్ మధు అంబటి గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన నన్ను చూసి ఇదేంటి ఇతను రేవతి గారి తమ్ముడిలా ఉంటాడుగా అన్నారు. నువ్వు ఉండవయ్యా ఆవిడ ఒప్పుకున్నారు ఎదో ఒకటి చెయ్యవయ్యా అన్నా. అలా సినిమా షూటింగ్ అయ్యింది. తర్వాత ఇక సినిమా అవకాశాలు వస్తాయి..ఎవరితో ఎలా మాట్లాడాలి అని ఆలోచించుకుంటున్నా. మూవీ రిలీజ్ కాలేదు. రెండేళ్లు ఐపోయింది. రాఘవేంద్ర రావు గారికి ప్రివ్యూ వేసి చూపించారట. మా డైరెక్టర్ సినిమా ఎలా ఉంది అని అడిగేసరికి ఆయన ఎం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారట. దేవుడే నన్ను కాపాడాలి అని మా డైరెక్టర్ అనుకుంటే ఎస్ అని చెప్పి రాఘవేంద్రరావు వెళ్లిపోయారు. తర్వాత రామానాయుడు గారి దగ్గరకు వెళ్ళాడు మా డైరెక్టర్. ఈ సినిమా రిలీజ్ చేయడం నా వల్ల కాదు గాని కుర్రాడు బాగున్నాడు నా సినిమాలో వేషం ఇస్తాను సర్పయాగంలో వేషం ఇచ్చారు." అని చెప్పుకొచ్చాడు రాజా రవీంద్ర.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.