English | Telugu

మిస్టర్ పర్ఫెక్ట్, రంగస్థలం మూవీస్ వలన చాలా డిస్టర్బ్ అయ్యాను..

చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ అనగానే ఆర్కె. నాయుడు అలియాస్ సాగర్ గుర్తు రాకుండా ఉండరు. రీసెంట్ గా అతను "ది 100 " అనే మూవీలో నటించాడు. నటుడిగా కాకుంటే పోలీస్ అవ్వాలనే కల ఉండేదని సుమ చాట్ షోలో చెప్పుకొచ్చారు. మిస్టర్ పర్ఫెక్ట్, రంగస్థలం మూవీస్ లో ఛాన్సెస్ వచ్చాయి కానీ దాని వెనక స్టోరీ కూడా చెప్పారు. "మొగలి రేకులు పీక్ లో ఉన్నప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో శివాజీ అనే క్యారెక్టర్ గురించి చెప్పారు. ప్రభాస్ గారికి సెకండ్ లీడ్ గా అని చెప్పారు. ఐతే అప్పటికి నాకు మూవీస్ కి వెళ్లాలన్నా ఆలోచన లేదు. సీరియల్స్ లో చక్కగా నడుస్తోంది కదా అనుకున్నా. మంజుల నాయుడు గారికి ఇలా ఒక అవకాశం వచ్చింది అని అడిగాను.

బిందు నాయుడు గారిని అడగమన్నారు. ఐతే ఆవిడ మూవీ కాబట్టి డేట్స్ అడ్జస్ట్ చేస్తాను. కానీ 15 డేస్ కాబట్టి చాలా కష్టం కానీ ఓకే అని చెప్పారు. ఇక అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ నేను అనుకున్న క్యారెక్టరైజెషన్ కనిపించలేదు. చాలా నిరుత్సాహపడ్డాను. ఇది కాదు కదా నేను అనుకున్నది అనిపించింది. అలా కొన్ని రోజులు షూటింగ్ డేట్స్ ఇచ్చాను. ఫస్ట్ మూడు రోజులు షూటింగ్ జరగలేదు. ఏవో కొన్ని సీన్స్ చేసారు. కానీ అది కాదు కదా క్యారెక్టర్ అంటే అనిపించి డైరెక్టర్ ని అడిగాను. అర్ధం చేసుకోండి. అప్పుడప్పుడు రోల్స్ మారతాయి అన్నారు. కానీ నాకు నచ్చలేదు వచ్చేసాను. కానీ ఆ సీన్ ని మూవీలో ఉంచేశారు. ఐతే ఆ మూవీలో సీన్ చూసాక అందరూ అలాంటి క్యారెక్టర్ చేశావేంటి అని అడిగారు. అలాగే టి.సుబ్బిరామి రెడ్డి గారు కూడా ఫోన్ చేసి అలాంటి రోల్ చేశావేంటి అని అడిగారు. దాంతో నేను చాల డిస్టర్బ్ అయ్యాను. ఆ తర్వాత రంగస్థలం మూవీ టైంలో కూడా సుకుమార్ గారు అడిగారు. ఐతే మిస్టర్ పర్ఫెక్ట్ ఇన్సిడెంట్ మొత్తం చెప్పాను. కానీ అలా జరగదు అన్నారు. ఐతే తర్వాత ఆది గారిని కలిసారని తెలిసింది. ఆది గారు కూడా మొదట్లో ఒప్పోకోలేదు. నేను మనసు మార్చుకొని చేద్దాం అనుకున్నాను. కానీ, సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ఆది గారు ఓకే చెప్పేశారు." అని చెప్పుకొచ్చారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.