English | Telugu

Illu illalu pillalu : పుట్టింటికి వెళ్ళిపోమన్న ధీరజ్.. రామరాజుని‌ చూసి సాగర్ షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -203 లో... ప్రేమ, నర్మద ఇంటికి వస్తారు. ఈ రోజు మేం శ్రీవల్లి వాళ్ళ నాన్నని చూసాం.. సైకిల్ పై ఇడ్లీ అమ్ముతుంటే.. అనగానే అందరు షాక్ అవుతారు. శ్రీవల్లి మాత్రం టెన్షన్ పడుతుంది.

ఏంటి శ్రీవల్లి మీ నాన్న ఇడ్లీ అమ్మడం ఏంటని రామరాజు అడుగుతాడు. శ్రీవల్లి తడబడుతుంటే నేను ముందు నుండే అనుకున్న ఇడ్లీ బ్యాచ్ అని తిరుపతి అంటాడు. అంటే మావయ్య గారు శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్మడం లేదు.. వాళ్ళు చిరు వ్యాపారం చేసేవారికి ఫైనాన్స్ ఇస్తారు కదా అలాంటి వాళ్ళకి బిజినెస్ లో మెలకువలు నేర్పిస్తాడట అని నర్మద అంటుంది. అవునా అని రామరాజు అంటాడు. ఇప్పుడే చెప్పను అక్కా.. ముందు ఉంది ముసళ్ల పండుగ.. అసలు ఏం జరుగుతుందనే విషయం కనుక్కోవాలని నర్మద అనుకుంటుంది.

మరొక వైపు ధీరజ్ షర్ట్ తో ప్రేమ మాట్లాడతుంది. నువ్వు ఒక్కడివే కష్టపడుతుంటే చూడలేకపోతున్న అందుకే నీకు తెలియకుండా నేను వర్క్ చేస్తున్నానని ప్రేమ అంటుంటే అప్పుడ్ ధీరజ్ వస్తాడు. అంతా విన్నాడేమోనని ప్రేమ టెన్షన్ పడుతుంది కానీ ధీరజ్ వినడు.

మరొకవైపు నర్మద, సాగర్ రాత్రి బయట కూర్చొని ఉంటారు. సాగర్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతాడు. అదంతా శ్రీవల్లి చూసి కావాలనే రామరాజుకి చూపించాలని అనుకుంటుంది. మావయ్య దొంగ అంటూ అరుస్తుంది. అందరు బయటకు వస్తారు. సాగర్, నర్మదలని రామరాజు చూస్తాడు. రామారాజుని చూసి సాగర్ షాక్ అవుతాడు.

తరువాయి భాగంలో ప్రేమ తన పుట్టింటి వాళ్ళ ఫోటో చూసి బాధపడుతుంటే మరి మీ ఇంటికి వెళ్ళు అంటు ప్రేమని వాళ్ళ ఇంటిముందుకి నెట్టేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.