English | Telugu

మొక్కు తీర్చుకుని అన్నదానం చేసిన ఫ్యామిలీ...


ప్రియాంక జైన్ - శివ్ కుమార్ ఇద్దరూ బుల్లితెర మీద మంచి జోడి అని అందరికీ తెలుసు. ఆడియన్స్ కి కూడా వీళ్లంటే చాలా ఇష్టం కూడా. బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రియాంక గేమ్ తో ఎంతోమంది ఫాన్స్ ని కూడా సంపాదించుకుంది. అలాంటి ప్రియాంక వాళ్ళ అమ్మకు సర్వైకల్ కాన్సర్ ఫస్ట్ స్టేజి అని తెలిసేసరికి ఇద్దరూ నీరుగారిపోయారు. ఇక ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు టెస్టులన్నీ చేసాక ఆమెకు లాప్రోస్కోపీ సర్జరీ చేసి గర్భాశయాన్ని తొలగించారు. ఇలా సర్జరీ మొత్తం పూర్తై ప్రస్తుతానికి అన్ని రకాల పరీక్షల్లో కూడా ఆమె సేఫ్ అని తెలుసుకున్నాక ప్రియాంక- శివ్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆమె కోలుకుని తిరిగి వాళ్ళ ఇంటికి రావడంతో ఆ హ్యాపీనెస్ వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేసింది ప్రియాంక . అలాగే రాముల వారి గుడికి వెళ్లి అక్కడ మొక్కు కూడా తీర్చుకుంది ప్రియాంక. కాన్సర్ నయం చేసుకుని తిరిగి వచ్చిన వాళ్ళ అమ్మను చూసి ఇదంతా ఆడియన్స్ ప్రేమ, అభిమానం, బ్లెస్సింగ్స్ వల్లనే జరిగాయని చెప్పింది.

ఇక ఈ రాముల వారి ఆలయంలో 400 ల ఏళ్ళ క్రితం నాడు ఉద్భవించిన హనుమంతుడి ఒరిజినల్ విగ్రహాన్ని శివ్ చూపించాడు. అలాగే ఆలయంలో పూజలన్ని పూర్తి చేసుకున్నాక అన్నదానం నిర్వహించారు. ఇక ఫైనల్ గా ప్రియాంక జైన్, శివ్ కుమార్ కలిసి చాలా హ్యాపీగా మాట్లాడుకున్నారు. ఐతే హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ముగ్గురినీ చూసి ఇందులో పేషెంట్ ఎవరూ అని అడిగారట డాక్టర్..అదే ట్విస్ట్.. అంటే ఆమె పేషెంట్ లా కనిపించరు ఆమె చాలా స్ట్రాంగ్ అని చెప్పాడు శివ్. ఎందుకంటే ప్రియాంక వాళ్ళ అమ్మ చూడడానికి తల్లీకూతుళ్లలా కాకుండా అక్క చెల్లెళ్ళలా కనిపిస్తారు. ప్రియాంక బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆమెను చూడడానికి నటి ప్రగతితో కలిసి బిగ్ బాస్ స్టేజ్‌ మీదకు వచ్చింది ప్రియాంక జైన్ తల్లి. ఆమెను చూసి నాగార్జున కూడా ఫిదా ఇపోయారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.