English | Telugu

ఈ నెల తనకి సెంటిమెంట్ అంటున్న పూజామూర్తి !

కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్ని అలావాట్లు, ఫేవరెట్ కర్రీ, ఫేవరెట్ డ్రెస్ లాంటివి ఉంటాయి. అలాగే ఫేవరెట్ మంత్ కూడా ఉంటుంది. అయితే మార్చి అనగానే స్టుడెంట్స్ కి గుర్తొచ్చేవి పరీక్షలు, కాలేజీ వాళ్ళకి సమ్మరవ హాలిడేస్.‌..సెలెబ్రిటీలకు వెకేషన్స్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ పూజామూర్తికి మాత్రం మార్చి నెల సెంటిమెంట్ అంట‌. మరి ఎందుకు తనకి ఈ నెల ఎందుకు అంత స్పెషలో ఓసారి చూసేద్దాం.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ 2.0 లో గ్రాంఢ్ గా ఎంట్రీ ఇచ్చిన పూజామూర్తి ‌హౌస్ లో తన ఆటతీరు, మాటతీరుతో ఆకట్టుకుంది. 2.0 లో అంబటి అర్జున్, నయని పావని, భోలే షావలి, పూజామూర్తి, అశ్వినిశ్రీ లు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. "గుండమ్మ గారి కథ" సీరియల్ లొ ప్రధాన పాత్ర పోషించిన పూజామూర్తి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఎవరితోను‌ ఎక్కువగా కలవలేకపోయింది. అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ తో ఎక్కువ సమయం ఉండటంతో కాస్త పాజిటివిటీని పొందినా అశ్వినిశ్రీతో గొడవ పెద్ద మైనస్ గా మారింది. నోటికొచ్చినట్టు మాట్లాడటంతో తను హౌస్ లో రూడ్ బిహేవియర్ లా అనిపించింది. అయితే అన్నింటికన్నా ముఖ్యంగా నామినేషన్లో పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసి చెప్పిన రీజన్ సరైనది కాదని అందరూ భావించారు. ఆ తర్వాత పూజామూర్తి ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది.

పూజామూర్తి ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఫోటోలు , వీడియోలని పోస్ట్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రస్తుతం తను 106K ఫాలోవర్స్ ని కలిగి ఉంది. కొన్ని రోజుల క్రితం శుభశ్రీతో కలిసి ' కుకింగ్ ఛాలెంజ్ విత్ గుండమ్మ ' అనే వ్లాగ్ చేయగా.. దానికి అత్యధిక వీక్షకాధరణ లభించింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ అంతా బిబి మహోత్సవం షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ప్రేమ, సంపద, మనశ్శాంతి, దయ, హీలింగ్, ప్రోగ్రెస్, బ్లెస్సింగ్స్ ఇలా అన్నీ లైఫ్ లో పొందాలని భావిస్తున్నాను అంటు పూజామూర్తి పోస్ట్ చేసింది‌. దీంతో పూజామూర్తి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అయితే హౌస్ లో రెండు వారాలు మాత్రమే ఉన్న పూజామూర్తి కొంత ఫ్యాన్ బేస్ ని కూడా సొంతం చేసుకుంది. అయితే మీలో ఎంతమందికి పూజామూర్తి తెలుసో కామెంట్ చేయండి.


Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.