English | Telugu

నేను యాక్టర్ కాకపోయి ఉంటే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యేవాడిని 


పిఠాపురం కమిటీ కుర్రాళ్ళు పేరుతో ప్రసారమైన దసరా ఈవెంట్ అందరినీ అలరించింది. ఇందులో ఒక స్కిట్ చేశారు డ్రామా జూనియర్స్ లోని కొంతమంది పిల్లలు. ఆర్టిస్టులు కాకపోయి ఉంటే లైఫ్ లో ఇంకేం అయ్యేవాళ్ళు అంటూ.. అందులో ఒక కుర్రాడు ఆది పోస్టర్ వేసుకుని సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ లా వచ్చాడు. ఒక చిన్నారి పూర్ణ పోస్టర్ వేసుకుని డాన్స్ టీచర్ ల వచ్చింది. ఇంకో కుర్రాడు రాంప్రసాద్ పోస్టర్ తో మెడికల్ షాప్ ఓనర్ లా వచ్చాడు. ఇంకో చిన్నారి సుహాసిని పోస్టర్ తో డాక్టర్ డ్రెస్ లో వచ్చింది. ఇక శ్రీముఖి ఒక్కొక్కరి ప్రొఫెషన్ గురించి అడిగి తెలుసుకుంది. "ఒకవేళా ఇలా యాక్టర్ కాకపోయి ఉంటే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యేవాళ్ళ" అని ఆదిని అడిగింది శ్రీముఖి.

"అవును నేను బిటెక్ కంప్లీట్ చేసి ఒక రెండు నెలలు ట్రై చేసాను. వాళ్లేమో ఒక చోటే కూర్చోమన్నారు. నాకేమో ఒక చోట కూర్చోవడం ఇష్టం లేదు. ఇక్కడంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. కానీ అక్కడా అలా ఏమీ మాట్లాడలేనుగా" అన్నాడు. "సుహాసిని నువ్వు యాక్టర్ కాకపోయి ఉంటే డాక్టర్ అయ్యేదానివన్నమాట ఇలాగా" అని శ్రీముఖి అనేసరికి "అవును నాకు ఇంజక్షన్ చేయడం అంటే ఇష్టం" అని చెప్పింది. తర్వాత ఎంబిబిఎస్ అంటే ఏంటి అని శ్రీముఖి అడిగేసరికి చెప్పలేకపోయింది సుహాసిని. "మిస్టర్ రాంప్రసాద్ మీరేంటి మెడికల్ షాప్ ఏంటి" అని శ్రీముఖి అడిగేసరికి "నేను ఇండస్ట్రీలోకి రాకముందు మెడికల్ లో ఉండేవాడిని ఒక షాప్ కూడా ఉంది నాకు., ఇక్కడ చేస్తూ అక్కడ షాప్ చూసుకునేవాడిని. ఇక్కడ బాగుండేసరికి అది వదిలేసి వచ్చాను. చాలామంది ప్రాణాలు కాపాడాను" అని చెప్పాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.