English | Telugu

పల్లవి గౌడ ‘నిండు నూరేళ్ళ సావాసం’ ఎప్పుడంటే!

టెలివిజన్ రంగంలో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించేది స్టార్ మా టీవీ, జీ తెలుగు సీరియల్స్.. వీటిల్లో బాగా పాపులర్ అయినవి చాలానే ఉన్నాయి. స్టార్ మా టీవీలో బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి, గుప్పెడంత మనసు, గృహలక్ష్మి, మల్లి, నాగపంచమి ఉండగా.. జీ తెలుగులో రాధమ్మ కూతురు, రాధకు నీవేరా ప్రాణం వంటి సీరియల్స్ పాపులర్ అయ్యాయి.

పసుపు కుంకుమ, సావిత్రి మొదలైన సీరియల్స్ లో నటించిన పల్లవి గౌడ అందరికి సుపరిచితమే.. అయితే కొన్ని సంవత్సరాలుగా రెస్ట్ తీసుకున్న పల్లవి గౌడ.. చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీగా చేసిన సీరియల్... 'నిండు నూరేళ్ళ సావాసం'. పల్లవి గౌడ కన్నడ నటి.. తెలుగులో పసుపు కుంకుమ, సావిత్రి సీరియల్స్ చేసిన తర్వాత కన్నడలో గాలిపాట, పరిణయ, శాంతం పాపం వంటి సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత తెలుగులో చదరంగం, సూర్యకాంతం సీరియల్స్ లో నటించింది పల్లవి గౌడ. అయితే సీరియల్స్ తో పాటు పలు కన్నడ సినిమాలలో నటించి‌న పల్లవి గౌడ.. రెండు రాష్ట్రాలు, అమ్మ ఆవకాయ అంజలి లాంటి తెలుగు వెబ్ సిరీస్ లలో నటించింది. అయితే చాలా గ్యాప్ తర్వాత 'నిండు నూరేళ్ళ సావాసం' తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది పల్లవి గౌడ.

తన కుటుంబమే శ్వాసగా.. ప్రేమకు చిరునామాగా.. అమాయకత్వమే ఆభరణంగా.. అందరిలో కనిపించే రూపమే మన అరుంధతి అంటూ పల్లవి గౌడ ఈ సీరియల్ లో పరిచయమవుతుంది. కాగా ఆమె భర్త మిలటరీలో చేసే సైనికుడు.. అతని పేరు అమరేంద్ర.. అయితే పల్లవి గౌడ ఒక ఆత్మ పాత్రలో కనిపిస్తుంది. అయితే తను చనిపోయాక పిల్లల సంరక్షణ కోసం అమరేంద్ర భాగమతి అనే అమ్మాయిని అపాయింట్ చేస్తాడు. అయితే ఆటలు, పాటలతో గడిచే పిల్లల బాల్యం భాగమతి చేతిలో ఉంది. మరి అమ్మ లేని లోటుని భాగమతి తీర్చగలదా.. చూడాలంటే అగస్ట్ 14 వ తేదీన ప్రారంభమ్యే ఈ సీరియల్ చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.