English | Telugu

కిరాక్ ఆర్పీకి ఒకరోజు కేటాయించిన మెహ్రీన్!

ఒకప్పుడు జబర్దస్త్ లో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న కిరాక్ ఆర్పీ గురించి అందరికీ తెలుసు. ఐతే ఆర్పీ నాగబాబుతో పాటు షో నుంచి బయటకు వచ్చేసి ఫుడ్ బిజినెస్ రంగంలోకి వచ్చేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును ఫేమస్ చేసే పనిలో పడ్డాడు.

దీనికి సంబందించిన ఎన్నో బ్రాంచెస్ ని ఓపెన్ చేసాడు. రెస్టారెంట్ బిజినెస్ లో మంచి సక్సెస్ అందుకున్నాడు. హైదరాబాదులో ఎన్నో బ్రాంచ్ లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రలోనూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించారు. త్వరలోనే తిరుపతిలో బ్రాంచ్ ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని ఆర్పి వెల్లడించారు. అయితే నవంబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ రెస్టారెంట్ ప్రారంభం కాబోతుందని చెప్పారు.


ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవాన్ని ప్రముఖ నటి మెహరీన్ చేతుల మీదుగా చేయబోతున్నట్లు కిరాక్ ఆర్పీ వెల్లడించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారేసరికి నెటిజన్స్ అంతా ఆర్పీకి విషెస్ చెప్తున్నారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక మల్లెమాల సంస్థ గురించి ప్రతీ ఇంటర్వ్యూలో నెగటివ్ గా మాట్లాడేసరికి బుల్లితెర షోస్ లో ఆర్పీ పెద్దగా క్లిక్ కాకపోయేసరికి బుల్లితెరకు పూర్తిగా దూరమైపోయాడు.

ఇక నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును జనాల్లోకి తీసుకెళ్లడానికి తన బ్రాంచెస్ ని ఇంకా ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాడు అలాగే ఆ రెస్టారెంట్స్ లో మంచి చెఫ్స్ ని పెట్టి ఈ పులుసును ప్రిపేర్ చేయిస్తున్నాడు. ఇక బుల్లితెర, వెండితెర నుంచి చాలామంది కూడా ఆర్పీ రెస్టారెంట్ లో చేపల పులుసును టేస్ట్ చేసి అందరూ మంచి రేటింగ్స్ ఐతే ఇచ్చారు. బుల్లితెర మీద ఉన్న చాల మంది కూడా అటు డైరెక్టర్స్ గా రాణిస్తూ మరో వైపు హీరోస్ గా దూసుకుపోతూ ఇంకో వైపు ఫుడ్ బిజినెస్ లాంటివి పెట్టి రన్ చేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు.


Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.