English | Telugu

'నీకు వారసుడు కావాలంటే దిల్ రాజుని అడగండి' కార్తిక్ కి నరేష్ సలహా

ఎక్స్ట్రా జబర్దస్త్ ఈవారం నవ్వించడానికి చక్కగా ముస్తాబై వచ్చేసింది. ఇందులో కెవ్వు కార్తిక్ టీమ్ చేసిన స్కిట్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ టీమ్ లో నాటీ నరేష్ పెదరాయుడు వేషంలో వచ్చాడు. "నాన్న గారు నాకు పెదరాయుడు అనే పేరు ఎందుకు పెట్టారు" అని నరేష్ కార్తిక్ ని అడిగేసరికి " కనీసం పేరైనా పెద్దగా ఉండాలని" ఆన్సర్ ఇచ్చాడు కార్తీక్. దాంతో షాకయ్యాడు నరేష్..ఇంతలో "పెదరాయుడు నాకు నువ్వు వారసుడిని ఇవ్వాలిరా" అని అనేసరికి "దిల్ రాజు గారిని అడగండి ఐతే అని నరేష్ చెప్పిన ఆన్సర్ కి కార్తిక్ అవాక్కయ్యాడు. ఎందుకంటే వారసుడు మూవీని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళల్లో దిల్ రాజు కూడా ఒకరు. ఇక ఈ టీమ్ లో శాంతి స్వరూప్ లేడీ గెటప్ లో టీచర్ గా వచ్చాడు.

తన దగ్గర ఉన్న రౌడీ మూకకు ఏ,బి,సి,డిలు నేర్పమని కార్తిక్ చెప్పేసరికి "ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే..సి వచ్చి డి పై వాలే..మీరంతా వచ్చి నాపై వాలండి " అనే సాంగ్ ని పాఠంలా చెప్పి నవ్వించాడు శాంతి స్వరూప్. ఇక ఫైనల్ లో పెదరాయుడు మూవీ నుంచి "బావవి నువ్వు..భామను నేను" సాంగ్ కి రష్మీ, శాంతి స్వరూప్, ఖుష్భు కలిసి డాన్స్ చేశారు. మధ్యలో బులెట్ భాస్కర్ వచ్చి ఖుష్భుతో జాయిన్ అయ్యి డాన్స్ చేసాడు. వీళ్లంతా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొచ్చి మరీ ఎంటర్టైన్ చేశారు. ప్రతీ వారం ఫైనల్ లో బులెట్ భాస్కర్-ఖుష్భు డాన్స్ ఉండాల్సిందే..అలా ఈ వారం కూడా డాన్స్ చేసి దుమ్ము లేపారిద్దరూ.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.