English | Telugu

Illu illalu pillalu : భాగ్యం, శ్రీవల్లిల ప్లాన్ ఫెయిల్.. ఎంగేజ్ మెంట్ సక్సెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -371 లో.. అమూల్య ఎంగేజ్ మెంట్ ఎలాగైనా అపాలని శ్రీవల్లి అన్ని ప్రయత్నాలు చేసి విఫలం అవుతుంది. దాంతో విసుగు వచ్చి ఎలాగైనా మీరే ఆపుకోండి అని అమూల్య, విశ్వ ఉన్న ఫొటోస్ భాగ్యంకి ఇచ్చి శ్రీవల్లి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆనందరావు వస్తాడు. ఏం చెయ్యాలని అంటాడు. ఈ ఫొటోస్ అందరు చూసేలా చేసి ఎంగేజ్ మెంట్ ఆగేలా చెయ్యాలని భాగ్యం అంటుంది. అదేంతా పని ఆనందరావు అంటాడు. అప్పుడే కామాక్షి బ్యాగ్ తిరుపతి ఓపెన్ చేసి మా బావ ఇంటిని గుల్ల చేస్తుందని కామాక్షి దాచుకున్న వస్తువులు తీసి సూటు కేసుని పక్కన నెడుతాడు.

అ సూట్ కేసు ఆనందరావుకి తగిలి ఫొటోస్ అన్ని కింద పడిపోతాయ్ అ ఫొటోస్ ని కామాక్షి పిల్లలు పట్టుకొని ఆడుతారు. వాటిని ప్రేమ చూసి పిల్లల దగ్గర నుండి తీసుకోవాలని ట్రై చేస్తుంది. అప్పుడే ధీరజ్ ఎదరుపడుతాడు. మళ్ళీ ఇద్దరికి గోడవ అవుతుంది. ఆ తర్వాతర్వాత నర్మద వస్తుంది. ప్రేమ ఫొటోస్ గురించి చెప్తుంది. పిల్లలు ఆడుతు పడిపోతారు. ఆ ఫొటోస్ ఎంగేజ్ మెంట్ దగ్గర పడుతాయి. దాంతో శ్రీవల్లికి ఫ్యాన్ వెయ్యమని సైగ చేస్తుంది భాగ్యం. ఇక శ్రీవల్లి ఫ్యాన్ వెయ్యగానే ఫొటోస్ రివర్స్ అవుతాయి. అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకుంటారు. ఫొటోస్ పై నర్మద స్వీట్ ప్లేట్ పెట్టి కవర్ చేస్తుంది. స్వీట్ ప్లేట్ తీసి ఫొటోస్ ప్రేమకి ఇస్తుంది. అదంతా చూస్తున్న భాగ్యం డిస్సపాయింట్ అవుతుంది. ఇరు కుటుంబాలు తాంబులాలు మార్చుకుంటారు.

అందరు చాలా హ్యాపీగా ఉంటారు. డ్యాన్స్ చేస్తారు. అబ్బాయి వాళ్ళ అమ్మ రామరాజుకి ఇరవై లక్షలు ఇచ్చి.. నా కోడలికి నగలు కొనండి అంటుంది. రామరాజు వద్దంటున్న కూడా అబ్బాయి వాళ్ళ అమ్మ వనజ ఇస్తుంది. ఆ తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళు వెళ్తుంటే బయటవరకు వస్తారు. అదంతా పైనుండి విశ్వ, భద్రవతి చూస్తారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.