English | Telugu

ఇనయా.. పొద్దుతిరుగుడు పువ్వు!

బిగ్ బాస్ హౌస్ లో రిలేషన్స్ లాగా కలిసిపోయి, విడిపోతూ ఉంటారు కంటెస్టెంట్స్. అయితే కొందరు మాత్రం, ఆటలో పెర్ఫార్మన్స్ కంటే కూడా మిగతా వారిని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారు. కాగా ఈ మధ్య సూర్య తో ఎక్కువ సన్నిహితంగా ఉంటోంది ఇనయా.

ఈ విషయమే ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకులకు, హౌస్ మేట్స్ కి కొత్త ప్రేమ కథలా తోస్తోంది. ఇలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. మొన్న జరిగిన టాస్క్ లో " హౌస్ లో నీ క్రష్ ఎవరూ? ఎందకు?" అని బిగ్ బాస్ అడుగగా, "సూర్య అంటే నాకు‌ ఇష్టం అని" చెప్పేసింది. ఈ విషయం ప్రేక్షకులకు తెలిసిందే. అయితే సూర్య కూడా ఆరోహి వెళ్ళిపోయినా తరువాత ఇనయాతో ఎక్కువ క్లోజ్ గా ఉంటున్నాడు. ఇనయా కూడా సేమ్ అలానే ప్రవర్తిస్తోంది. తను గేమ్ పై ఫోకస్ చేయట్లేదు అని శనివారం రోజు నాగార్జున చెప్పడం జరిగింది. కాగా ఎప్పుడు కూడా సూర్య పక్కనే కన్పించడం, ప్రేక్షకులకు సైతం ఉన్న డౌట్స్ ని క్లియర్ చేసింది. నాగార్జున ఒక గేమ్ లో కూడా బజర్ దగ్గర సూర్య, ఇనయా ఉండగా, "దూరంగా ఉండు బజర్ కి కాదు ఇనయాకి" అని అన్నాడు. ఇనయా మాత్రం హౌస్ లోకి ఒక సూర్య కోసం మాత్రమే వచ్చినట్టుగా ప్రవర్తిస్తోంది. ఇనయ మొదటి రెండు వారాలు సూపర్ గా అడి, నాగార్జున మెప్పుపొందింది. కాగా ఈ శనివారం మాత్రం "పర్ఫామెన్స్ సరిగ్గా లేదని గేమ్ మీద పెట్టు దృష్టిని" అని చిన్నగా హెచ్చరించాడు.

నాగార్జున, ఇనయాని "పొద్దుతిరుగుడు పువ్వు లాగా సూర్య వైపే ఉంటున్నావ్" అని అనడం తో, "అలాగేం‌ లేదు సర్, ఇక నుండి ఆలా ఏం ఉండదు." అంటోంది ఇనయ. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అని నాగార్జున , సుదీపతో అనగా, సుదీప మాట్లాడుతూ, "సూర్య ఉన్నాడుగా, అందుకే నవ్వుతూనే ఉంటుంది" అని చెప్పింది. ఈ రోజు ఇచ్చిన టాస్క్ లో కూడా 'సొల్లు ఆపు దమ్ముంటే నన్ను ఆపు' అనే ట్యాగ్ డైలాగ్ ఉన్న బోర్డు వేసి వివరించింది. "మొన్న టాస్క్ లో నన్ను ఆడనివ్వడం లేదు సార్. నా చేతిలోని బాల్ ని లాగేసుకున్నాడు" అని చెప్పడం తో సూర్య మట్లాడుతూ, "లాగేసుకోవడం కాదు సార్, నేను గేమ్ ఆడుతున్న" అని చెప్పాడు. దానికి సమాధానంగా, "దమ్ముంటే ఇక ముందు ఆపు" అంటూ సెటైర్లు వేసింది ఇనయా.

రాబోయే రోజుల్లో ఇనయ ఆటలో పెర్ఫార్మన్స్ చూపిస్తుందో లేక క్రష్ అనుకుంటూ, సూర్య వెనకాల తిరుగుతుందో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.