English | Telugu

ప్రియమైన అమ్మలతో ఆర్టిస్టులు....మదర్స్ డే స్పెషల్ ఈవెంట్

ఈటీవీ ప్రతీ స్పెషల్ ఈవెంట్ ని అస్సలు మిస్ కాకుండా ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు రాబోయే వారం మదర్స్ డేని పురస్కరించుకుని "ప్రియమైన అమ్మకు" అనే స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి యాంకర్స్ గా మానస్, విష్ణుప్రియ వ్యవహరించారు. "విష్ణు ఈరోజు మదర్స్ డే కదా. నువ్వు అమ్మను ఎంత మిస్ అవుతున్నావో నాకు తెలుసు. అందుకే మన ఆర్టిస్ట్స్ అందరినీ వాళ్ళ ఫామిలీస్ తో పాటు ఇక్కడికి ఒక గెట్ టు గెదర్ లాగా నీకోసం అని ఆర్గనైజ్ చేసాను.. హ్యాపీ మదర్స్ డే విష్ణు" అని చెప్పాడు మానస్. బ్యాక్ గ్రౌండ్ లో విష్ణుప్రియ వాళ్ళ అమ్మతో గడిపిన క్షణాలను ప్లే చేసి చూపించారు.

అలాగే ఈ ఈవెంట్ లో వర్ష, శ్రీవాణి, రాశి, సత్య, మధుప్రియ, హైపర్ ఆది, అంబటి అర్జున్, రాకింగ్ రాకేష్, అమరదీప్, రాంప్రసాద్, హిమజ, అన్నపూర్ణ, ఇలా బుల్లితెర ఆర్టిస్టులంతా పార్టిసిపేట్ చేశారు. బులెట్ భాస్కర్ వాళ్ళ అమ్మ, నాన్న ఈ షోకి వచ్చారు. "ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నా అందుకే నాకు కొడుకు పుట్టాడు" అని అంది. "మా అమ్మ ఇళ్లల్లో పాచి పని చేసి నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది" అని శాంతిస్వరూప్ వాళ్ళ అమ్మ గురించి చెప్పాడు. "ఎంత అడిగినా తిరిగి మా అమ్మ రాదు..అమ్మా ఐ లవ్ యు ..ఐ మిస్ యు " అంటూ విష్ణు స్టేజి మీద ఏడ్చేసింది. ఇక ఈ షో మే 14 వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కాబోతోంది. ఇందులో అంబటి అర్జున్ పుష్ప 2 లో అల్లు అర్జున్ వేసిన గెటప్ ని అలాగే దింపేసాడు. ఇక ఈ షో ఎలా ఉండబోతోంది. వాళ్ళ వాళ్ళ మదర్స్ తో ఉన్న రిలేషన్ గురించి ఎవరెవరు ఏం చెప్తారో చూద్దాం.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.