English | Telugu

అల్టిమేట్ డ్యాన్స్ తో ఆకట్టుకుంటోన్న బీబీ జోడి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బీబీ జోడి' ఆసక్తికరంగా సాగుతోంది. ఒక్కో జోడి ఒక్కో లెవల్ పర్ఫామెన్స్ ఇస్తూ అల్టిమేట్ డ్యాన్స్ ని చేస్తున్నారు. కాగా ఈ బీబీ జోడిల డ్యాన్స్ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది.

రవికృష్ణ-భాను జోడి మొదట డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసారు. పొగలు వచ్చేలాగా చేశారని శ్రీముఖి చెప్పగా... సదా గూస్ బంప్స్ వచ్చాయని చెప్పింది. పర్ఫెక్ట్ మూమెంట్స్ అని రాధ చెప్పింది. "స్పానిష్ డ్యాన్స్ ఎలా చేస్తారో అనుకున్నా కానీ యూ గాయ్స్ ఆర్ డామినేటింగ్ ద స్టేజ్" అని తరుణ్ మాస్టర్ చెప్పాడు. ఆ తర్వాత అవినాష్-అరియానా జోడి కలిసి శివుడు, గంగలుగా కలసి చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. "గెటప్ ని డామినేట్ చేసావ్ అవినాష్. గంగ లాగా అరియానా... యూ డిసర్వింగ్" అని తరుణ్ మాస్టర్ చెప్పాడు. "అమేజింగ్ కొరియోగ్రఫీ, మీరు శివుడిలాగా రౌద్రం చూపించిన తీరు అద్భుతం" అని సదా చెప్పుకొచ్చింది. అర్జున్- వసంతి జోడి చేసిన డ్యాన్స్ కి 'ఓ మై గాడ్' అని అరిచింది రాధ. 'బీబీ జోడియా మజాకా' అని తరుణ్ మాస్టర్ చెప్పాడు. "కెమెస్ట్రీ బాగుంది. అర్జున్ వెల్ డన్.. ఇప్పుడు లిప్ బాగా ఇచ్చారు. ఎక్స్‌ప్రెసెషన్ కూడా ఎలివేట్ అయ్యింది. లవ్లీ పర్ఫామెన్స్. యూ పుట్ ఇన్ ఆల్... ఎవ్రీతింగ్ ఫైన్" అని సదా చెప్పింది.

శ్రీసత్య-మెహబూబ్ జోడి కలిసి సాల్సా డ్యాన్స్ చేసారు.‌ ఇది చూసి జడ్జ్ లు షాక్ అయ్యారు. మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ ఇచ్చి బెస్ట్ పర్ఫామర్స్ గా నిలిచారు. జడ్జ్ లు అన్ని‌ జోడిలకు ఫుల్‌ మార్క్స్ ఇచ్చారు. ఈ వారం జరిగిన అన్ని జోడీల పర్ఫామెన్స్ అల్టిమేట్ డ్యాన్స్ గా నిలిచింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.