English | Telugu

టాయిలెట్ కి అని చెప్పి వెళ్తూ ఆ పని చేసేవాడిని...నువ్వు దేన్నైనా ఫినిష్ చేసేస్తావ్


"సుమ అడ్డా షో" ప్రతీ వారంలాగే ఈ వారం కూడా ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఈ వారం మహేష్ విట్టా- హరితేజ, అష్షు రెడ్డి-మహేష్ ఆచంట వచ్చారు. ఫస్ట్ రౌండ్ లో "పరీక్షలు అనగానే ఏమి గుర్తొస్తుంది" అని అడిగేసరికి "నేను అందరూ నిద్రపోయాక 11 గంటల నుంచి చదువుకోవడం మొదలు పెట్టేదాన్ని. అలా పరీక్ష టైం వరకు చదువుకుని ఆ తర్వాత ముఖం కడుక్కుని ఎగ్జామ్ కి వెళ్లిపోయేదాన్ని" అని హరితేజ అనేసరికి.."ఎగ్జామ్ హాల్ కి వెళ్లి అక్కడ నిద్రపోయేది" అంటూ కౌంటర్ వేసాడు మహేష్ ఆచంట. "మీరేం చేసేవారు" అంటూ సుమ మహేష్ విట్టాని అడిగేసరికి " నేను రాత్రంతా బాగా నిద్రపోయేవాడిని ఎగ్జామ్ లో ఎదో ఒకటి రాసేవాడిని..దేనికైనా ఆన్సర్ తెలీనప్పుడు టాయిలెట్ అని చెప్పి అందరి ఆన్సర్ షీట్స్ చూసుకుంటూ వెళ్ళేవాడిని" అని చెప్పాడు.

"రిజల్ట్ వచ్చినప్పుడు ఎలా ఉండేది ఇంట్లో పరిస్థితి" అని అడిగేసరికి "ఇంటికి రానని చెప్పేదాన్ని" అని హరితేజ అనేసరికి "అంత బాగా చదివావు కదా.. ఎందుకు మరి భయం" అని సుమ అడిగేసరికి "అది చదవడం కాదు యాక్ట్ చేయడం" అని అసలు నిజం చెప్పేసింది హరితేజ. "మరి నీ పరిస్థితి ఏమిటి అని మహేష్ ఆచంటని అడిగింది సుమ. నేను అన్నిట్లో పాస్ అయ్యాను. ఎంబిఏలో ఒక సబ్జెక్టు ఆగింది. అని చెప్పాడు. అంటే నువ్వు ఎంబిఏ వరకు వెళ్ళావు చూసావా అది చాల గ్రేట్ అంది సుమ. "ఎంబిఏ వరకు వెళ్ళాడు కానీ నేను ఎంబిఏ ఫినిష్ చేశా" అని మధ్యలో వచ్చిన అష్షు చెప్పేసరికి "నువ్వు దేన్నైనా ఫినిష్ చేసేస్తావు" అని కౌటర్ వేసింది సుమ. ఈ నలుగురు కూడా బుల్లితెర మీద వెండితెర మీద రాణిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో తమ తమ అప్ డేట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.