English | Telugu

మార్చ్ 14 నుంచి మధురానగరిలో... డైలీ సీరియల్

బుల్లి తెర మీద కీర్తి భట్ అంటే తెలియని వారంటూ ఎవరూ లేరు. కార్తీక దీపం సీరియల్ లో అమాయకమైన ముఖంతో హిమ రోల్ లో నటించింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకుంది. తన ఫామిలీ మొత్తం తనకు దూరమైనా ఎక్కడా, ఎప్పుడూ బాధపడకుండా తన జీవితాన్ని ఎంతో ధైర్యంతో ముందుకు తీసుకెళుతోంది. తనలాంటి పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు అని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. 2017 వ సంవత్సరంలో రూపొందిన కన్నడ చిత్రం 'ఐస్ మహల్' తో ఈమె నటిగా మారింది.

ఇప్పుడు ఈమె మెయిన్ రోల్ లో నటించిన "మధురానగరిలో.." సీరియల్ మార్చ్ 14 నుంచి స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సీరియల్ మధ్యాహ్నం 2 కి తెలుగు ఆడియన్స్ ని కట్టిపడేయడానికి రాబోతోంది. రియల్ లైఫ్ లో అమ్మా అని పిలిపించుకునే భాగ్యం లేదని కన్నీళ్లు పెట్టుకున్న కీర్తి 'మధురానగరిలో' సీరియల్ లో ఓ బాబుకి అమ్మగా..రాధగా నటిస్తోంది. సీరియల్ లో భాగంగా మ్యారేజ్ బ్యూరో నడుపుతూ ఉంటుంది. మంచి వాళ్లకు మంచి సంబంధాలు చూస్తూ...అబద్దాలు చెప్పేవాళ్లకు బుద్ది చెప్పే క్యారెక్టర్ లో నటిస్తోంది కీర్తి. మధురానగర్ కాలనీలో అందరికీ తలలో నాలుకలా ఉండే రాధ తన జీవితాన్ని సంతోషాన్ని ఎలా కోల్పోయింది ? అనేది ఈ స్టోరీ. ఆల్రెడీ కీర్తి నటనను కార్తీక దీపంలో చూసిన ఆడియన్స్ ఆమెకు నూటికి నూరు మార్కులు ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ సీరియల్ లో మలుపులు ఎలా ఉండబోతున్నాయి..కంటెంట్ ఎలా మెప్పించబోతోంది...కీర్తి నటన ఎలా ఉండబోతోంది తెలియాలి అంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.