English | Telugu

బిగ్ బాస్ అంటే వంటల షోనా..అక్కడికి వెళ్లి వంటలు చేయాలా


సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్ కుమార్ ఆంటీ గురించిన టాకే నడుస్తోంది. రీసెంట్ గా ఆమె పుట్టిన ఊరు గుడివాడలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు తప్ప తనకు ఎలాంటి ఆస్తి లేదని చెప్పిన కామెంట్స్ వలన తన ఫుడ్ బిజినెస్ పై వేటు పడిందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. దాంతో ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగిస్తున్నారన్న నెపంతో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఐతే ఇదంతా సోషల్ మీడియాలో రావడం నెటిజన్స్ అంతా కూడా కుమార్ ఆంటీకి సపోర్ట్ గా వీడియోస్, పిక్స్, కంటెంట్ పోస్ట్ చేస్తూ సపోర్ట్ చేయడాన్ని రేవంత్ సర్కార్ గమనించింది. దాంతి ఆమె బిజినెస్ కి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఆమె మీద కేసు అదీ ఏమీ పెట్టొద్దంటూ త్వరలో తానూ కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ని విజిట్ చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఇక ఈమె ఆనందం మాములుగా లేదు.

ఇక్కడి వరకు ఒక ఎత్తు ఐతే ఇప్పుడు కొత్త టాక్ నడుస్తోంది. సోషల్ మీడియా సెలెబ్రిటీస్ ని బిగ్ బాస్ గాలం వేసి పట్టుకుంటుందన్న విషయం తెలిసిందే కదా. అలా రాబోయే బిగ్ బాస్ సీజన్ 8 కి ఆమె వెళ్తుంది అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఐతే బిగ్ బాస్ అంటే ఏంటో కూడా కుమారి ఆంటీకి తెలీదు. "బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మిమ్మల్ని హౌస్ లోకి పంపిస్తే ఏం చేస్తారు" అని అడిగేసరికి "అంటే అదేమన్నా వంటల ప్రోగ్రామ..అందులో వంటలు చేస్తారా..నేను వెళ్లి అక్కడ వంటలు చేయాలా ?" అని అడిగింది..దీని బట్టి కుమారి ఆంటీకి బిగ్ బాస్ షో అంటే ఏంటో కూడా తెలీదని విషయం తెలుస్తోంది. తనకు బిగ్ బాస్ షో అంటే తనకు తెలీదని కేవలం నాలుగు సీరియల్స్ మాత్రమే చూస్తానని అలాగే తన భర్త పెట్టే న్యూస్ ఛానెల్స్ ని మాత్రమే చూస్తానని చెప్పింది. అలాగే ఆ నాలుగు సీరియల్స్ కూడా భోజనం చేసేటప్పుడు మాత్రమే చూస్తానని వేరే ఏవీ చూసే అవకాశం ఉండదు.. పనే సరిపోతుంది అని మరో ఇంటర్వ్యూలో చెప్పింది కుమారి ఆంటీ. కుమారి ఆంటీ చాలా తక్కువగా ధరకే ఫుడ్ అందిస్తూ ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.