English | Telugu

Krishna Mukunda Murari : ముకుంద కొత్త‌ డ్రామా.. ఆదర్శ్‌ కి మిగిలింది పాత  జ్ఞాపకాలే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -419 లో...ముకుంద నిజంగానే చనిపోయింది అనుకొని అందరు నమ్ముతారు. శ్రీనివాస్ ఇంటికి వచ్చి డోర్ తియ్యగానే ఎదరుగా ముకుంద కూర్చొని ఉంటుంది. ముకుందని చూసి శ్రీనివాస్ షాక్ అవుతాడు. ఏంటి నాన్న చనిపోయింది ఎలా బ్రతికి వచ్చిందని అనుకుంటున్నావా.. నేను చనిపోలేదు.. ఇదంతా నేను క్రియేట్ చేసిందేనని ముకుంద అంటుంది.

ఆ తర్వాత శ్రీనివాస్ కూడా ముకుందకి సపోర్ట్ గా మాట్లాడతాడు. వాళ్ళు నిన్ను మోసం చేసి ఇంట్లో నుండి పంపించారు. మనం ఎక్కడికైనా వెళదామని శ్రీనివాస్ అనగానే.. మురారికి దూరంగా వెళ్ళడానికా ఇదంతా చేసింది. ఎప్పుడు పక్కనే ఉండడానికి ఇదంతా చేస్తున్నాను. మురారిలాగే నేను రూపం మార్చుకుంటే నన్ను ఎవరు గుర్తుపట్టరని ముకుంద అంటుంది. నిన్ను మోసం చేసినవాళ్లకు ఇలా చెయ్యడమే కరెక్ట్ అని శ్రీనివాస్ అంటాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని శ్రీనివాస్ కి ముకుంద చెప్తుంది. ఆ తర్వాత ఆదర్శ్, తన ఫ్రెండ్ కలిసి డ్రింక్ చేస్తుంటారు. ఇదంతా కృష్ణ మీ కోసం ఏం చెయ్యలేదు.. ముకుందనే బలవంతంగా అయిన నీకు దగ్గర చేస్తే తన భర్తని వదిలేస్తుందని‌.. అప్పుడు కృష్ణ తన భర్తతో హ్యాపీగా ఉండొచ్చని ఇలా చేసిందని ఆదర్శ్ ఫ్రెండ్ ఆదర్శ్ తో అనగానే ఆదర్శ్ నిజమే అనుకుని కృష్ణపై కోపంగా ఉంటాడు.

ఆ తర్వాత శ్రీనివాస్ అన్న మాటలు గుర్తుకు చేసుకొని కృష్ణ బాధపడుతుంటే అప్పుడే రేవతి వచ్చి అడుగుతుంది. ముకుంద ఇంత పిచ్చి పని చేస్తుందని అనుకోలేదు అనగానే.. అంత నీ పుణ్యమే కదా అంటు ఆదర్శ్ వస్తాడు. ఇదంతా జరగడానికి కారణం మాత్రం నువ్వే అని కృష్ణపై ఆదర్శ్ కోప్పడతాడు. కృష్ణ అలాంటిది కాదని రేవతి, సుమలత, నందు చెప్పిన వినకుండా కృష్ణ వల్లే ఇదంతా అని ఆదర్శ్ అంటాడు. తరువాయి భాగంలో ముకుంద చాటుగా వచ్చి మురారిని చూస్తుంది. మురారి కూడా ముకుందని చూసి పరుగెడతాడు. మరొకవైపు రేవతికి కూడా ముకుంద వెనకాల వైపు నుండి కనిపిస్తుంది. ఆ తర్వాత కృష్ణ బట్టలు తీస్తుంటే బట్టల చాటున ముకుంద ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.