English | Telugu

Krishna Mukunda Murari : కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో సూపర్ ట్విస్ట్ !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -411 లో.. ఎక్కడ శోభనం గదిలో మొహం మీదే నువ్వు అంటే ఇష్టం లేదని ఆదర్శ్ తో ముకుంద చెప్తుందోనని కృష్ణ, మురారి డల్ గా ఇంటికి వస్తారు. అలా రావడం చూసి ఏమైందని రేవతి అడుగుతుంది. మీ అబ్బాయి నన్ను డ్రింక్ చేసి కొట్టాడని కృష్ణ అనగానే.. మురారితో పాటు అందరు షాక్ అవుతారు. ఏ తింగరి ఏం మాట్లాడుతున్నావ్.. అన్ని అబద్దాలు చెప్తుందని మురారి అంటాడు.

ఆ తర్వాత కృష్ణ గదిలోకి వెళ్తుంది. ఏమైంది వీళ్ళకి కృష్ణని మురారి కొట్టడమేంటని రేవతి అనుకుంటుంది. చూస్తుంటే ఈ శోభనం కూడా క్యాన్సిల్ అయ్యేలా ఉందని మధు అంటాడు. ఆ తర్వాత కృష్ణ గదిలోకి వెళ్ళగానే.. మురారి వెళ్లి ఎందుకు అలా చెప్పావ్? నాపై మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఎవరు నమ్మరని మురారి అంటాడు. ఆ తర్వాత మళ్ళీ శోభనం గదిలో ఆదర్శ్ కి నిజం తెలిస్తే పరిస్థితి ఏంటని కృష్ణ అంటుంది. ఇప్పటివరకు ముకుంద తనపై ఏది రాకుండా శోభనం ఆపించేయ్యాలని చూసింది. ఇప్పుడు నీక్కూడా తెలిసిందని తెలిస్తే.. ఎంతకైనా తెగిస్తుంది. నేను వెళ్లి ఆదర్శ్ తో శోభనం వాయిదా వెయ్యమని అడుగుతానన కృష్ణకి మురారి చెప్తాడు. మరొకవైపు ఈ శోభనం ఎలా ఆపాలని ముకుంద టెన్షన్ పడుతుంది. గీతిక చెప్పినట్టు చేస్తే ఈ శోభనం ఆగిపోతుంది కానీ ఒకవేళ ఆదర్శ్ నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తే ఏం చెయ్యాలని ముకుంద అనుకుంటుంది.

ఆ తర్వాత ఆదర్శ్ దగ్గరికి మురారి వస్తాడు. ముకుందని అర్థం చేసుకోవాలి. బాగా చూసుకోవాలని చెప్పాగానే నాకు తెలుసు రా నా గురించి బాగా ఆలోచిస్తావంటూ.. అసలు విషయం మురారిని చెప్పనివ్వడు. వాళ్ళ మాటలన్ని ముకుంద దూరం నుండి వింటుంది. శోభనం చెడగొట్ట అంటే ఎంకరేజ్ చేస్తున్నాడని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత మురారి వెళ్లి కృష్ణకి.. ఆదర్శ్ అసలు శోభనం వాయిదా వేద్దామనే విషయం చెప్పనివ్వలేదని మురారి అంటాడు‌. దాంతో కృష్ణ ఇంక టెన్షన్ పడుతుంది. తరువాయి భాగంలో ఆదర్శ్ ఇచ్చిన పాలు తాగనని ముకుంద చెప్తుంది. అవే మురారి ఎంగిలి పాలు ఇస్తే తాగేదాన్ని ఇంక మురారిని మర్చిపోలేదని ముకుంద చెప్పగానే ఆదర్శ్ బయటకు వచ్చి.. రేయ్ మురారి రారా బయటకు అంటు పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.