English | Telugu

Guppedantha Manasu : ఆరా తీస్తోన్న ఏంజిల్.. కాలేజీ గోడలపై మను, వసుధారల పోస్టర్లు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1017 లో.. ఏంజిల్ ని కాలేజీకి రమ్మని వసుధార చెప్తుంది. నీకు మను గారి గురించి తెలుసా? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా అని అడుగగా.. నిన్న నువ్వే పరిచయం చేసావ్ కదా.. నాకు ఎలా తెలుస్తుందని ఏంజిల్ అంటుంది. నిన్న మను కూడా అనుపమ గారిని అత్తయ్య అంటున్నావ్? మీకు తెలుసా అని అడిగాడని చెప్పగానే అప్పుడే అక్కడికి మను వస్తాడు.

ఆ తర్వాత మీ గురించే మాట్లాడుకుంటున్నామని మనుతో ఏంజిల్ అంటుంది. మా అత్తయ్య మీకు ముందే తెలుసా? నిన్న నేను అత్తయ్య అని పిలిస్తే అలా పిలుస్తున్నారని అడిగారు కదా అని ఏంజిల్ అనగానే.. అలా అడిగినంత మాత్రాన తెలిసినట్టు కాదు కదా అని మను అంటాడు. అప్పుడే అక్కడికి శైలేంద్ర వస్తాడు. ఏంజిల్ ని చూసి.. నువ్వు కూడ ఉన్నావా? ఎవరెవరో వస్తున్నారు. ఒక్కోసారి ఇది DBST కాలేజీయేనా అని డౌట్ వస్తుందని శైలంద్ర అంటాడు. ఇక వసుధారతో శైలేంద్ర ఎప్పటిలాగే వాదనకి దిగుతాడు. నేను, రాజీవ్ కలిసి చేసే ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని శైలేంద్ర తన మనసులో అనుకుంటాడు. మరొకవైపు చక్రపాణి దగ్గరికి రాజీవ్ వచ్చి మాట్లాడుతాడు. నీ కూతురు కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. నువ్వైన ఓపించాలి కదా.మ రెండు సంవత్సరాల నుండి ఈ తాళిని పట్టుకొని తిరుగుతున్నానని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత రాజీవ్ వెళ్ళిపోతాడు. కాసేపటికి వసుధారకి చక్రపాణి ఫోన్ చేసి.. ఆ దుర్మార్గుడు రాజీవ్ వచ్చాడని అంటాడు. అప్పుడే మళ్ళీ రాజీవ్ వచ్చి ఫోన్ తీసుకొని వసుధారతో మాట్లాడతాడు.

ఆ తర్వాత ఏంజిల్ కార్ స్టార్ట్ అవ్వదు. అప్పుడే మను వచ్చి రిపేర్ చెయ్యాలా అని అడుగుతాడు. అవసరం లేదని అనుపమ అంటుంది. ఆ తర్వాత మీకు ఇప్పటికే పరిచయం ఉండి.. ఏదైనా గొడవ ఉందా అని ఏంజిల్ అడుగుతుంది. అలాంటివేం లేవని అనుపమ అంటుంది. అదంతా వసుధార చూస్తుంటుంది. ఆ తర్వాత రాజీవ్.. వసుధార, మను ఇద్దరు గల ఫోటో పోస్టర్ల కొత్త ప్రేమ ప్రయాణం అంటూ టైటిల్ ఆడ్ చేస్తారు. ఆ పోస్టర్లని కాలేజీ గోడలపై అతికిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.