English | Telugu

మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్ లో కృష్ణకి మొదటి స్థానం!

తెలుగు టీవీ సీరియల్స్ లో బెస్ట్ యాక్టర్ గా 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ లోని కృష్ణ సెలెక్ట్ అయింది. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో టీఆర్పీలో మొదటి స్థానంలో బ్రహ్మముడి ఉండగా.. మూడవ స్థానంలో 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఉంది.

తాజాగా 'మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్ ' ర్యాంకింగ్స్ ని రిలీజ్ చేసింది ఓఆర్ మ్యాక్స్ సంస్థ.. ఈ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో కృష్ణ ముకుంద మురారి సీరియల్ లోని కృష్ణ ఉండగా రెండవ స్థానంలో త్రినయని సీరియల్ లోని నయని ఉంది. కాగా గుప్పెడంత మనసు సీరియల్ లోని వసుధార మూడవ స్థానంలో, రిషి నాల్గవ స్థానంలో ఉన్నారు. అయితే 'మల్లి.. నిండు జాబిల్లి' సీరియల్ లోని మల్లికి అయిదవ స్థానం దక్కింది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా మారుతుంది‌.‌ కారణం కృష్ణ, మురారి ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమించుకుంటారు. కానీ ఎవరి మనసులో ఏం ఉందో చెప్పుకోకుండా, తమలో తామే సందిగ్ధంలో ఉంటున్నారు. కాగా ఇదే సరైన సమయం అని భావించిన ముకుంద వాళ్ళిద్దరి మధ్య ఎలాగైనా దూరం పెంచాలని చూస్తుంది. నిన్న మొన్నటిదాకా భవానికి భయపడిన కృష్ణ.. తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో భవానికి దగ్గరవుతుంది. అలా కృష్ణ మారడానికి కారణం ఉంది.

గత వారం మురారిని జాబ్ కి వెళ్ళకూడదని కృష్ణ చెప్పడంతో.. తనకి ఆ జాబ్ ఎంత అవసరమో వివరించింది భవాని. దాంతో అప్పటిదాకా భవాని అంటే భయం ఉన్న కృష్ణ.‌. ఆ తర్వాత తన మాటలకి ఫిధా అయింది. ఆ తర్వాత తనని ఎలా ఇంప్రెస్ చేయాలని చూస్తుంది కృష్ణ. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ లలో భవానిలాగా కృష్ణ రెడీ అయి భవానీతో పాటు ఇంట్లో వాళ్ళందరిని ఇంప్రెస్ చేసింది. దాంతో భవానికి కూడా కృష్ణపై పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఈ రకంగా కృష్ణ ముకుంద సీరియల్ లో ప్రతివారం ఒక ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతుంది. దాంతో ఈ సీరియల్ ని చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇప్పుడు కృష్ణ మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్ లో మొదటి స్థానాన్ని పొందింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.