English | Telugu

Krishna Mukunda Murari:మారిపోయిన ముకుంద మనసులో ఏం ఉందో కృష్ణ కనిపెట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -382 లో.. మధు ఏదో స్క్రిప్ట్ రాస్తంటాడు. తన దగ్గరకి నందు వచ్చి అటపట్టిస్తుంటుంది. అప్పుడే కృష్ణ వచ్చి.. అందరిని హాల్లోకి పిలుస్తుంది. ఏంటని రేవతి అడుగుతుంది. మీకు అందరికి ఒక సర్ ప్రైజ్ అని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత వెళ్లి.. రెండు రింగ్స్ తీసుకొని వచ్చి నేను ముకుంద ఆదర్శ్ లా పెళ్లి చూడలేదు కదా.. అందుకే ఇప్పుడు వీళ్ళు రింగ్స్ మార్చుకుంటారని కృష్ణ అనగానే ముకుంద షాక్ అవుతుంది.

ముకుందకి ఇంట్రస్ట్ గా లేనట్టు ఉందని మధు అంటాడు. కృష్ణ ఇద్దరికి రింగ్స్ ఇస్తుంది. ముకుందకి ఆదర్శ్ రింగ్ తొడగబోతుంటే.. ముకుంద తన చెయ్యి వెనక్కి తీసుకుంటుంది. నేను చెప్పాను కదా తనకి ఇష్టం లేదని మధు అంటాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ముకుంద అనుకుంటుంది. నువ్వు ఆపు.. ప్రతిసారీ ఇష్టం లేదని అంటావని మధుపై ముకుంద కోప్పడుతుంది. మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది చూస్తే అలాగే అనిపిస్తుందని మధు అనగానే.. వేరే కారణం ఉండొచ్చు కదా.. మా కోసం కృష్ణ ఈ రింగ్స్ తీసుకొని వచ్చింది కానీ అభిమానంతో నేను ఈ రింగ్స్ కృష్ణ, మురారిలకి ఇస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు రింగ్స్ మార్చుకుంటారని ముకుంద అంటుంది. వెంటనే కావాలంటే వాళ్ళకి వేరే తెప్పిస్తాం కానీ మీరు ఇవి మార్చుకోండి అని మధు అంటాడు. కానీ ముకుంద తెలివిగా ఆదర్శ చేత రింగ్ తొడిగించుకోకుండా తప్పించుకుంటుంది. నేను తప్పుగా మాట్లాడితే.. పెద్దత్తయ్య ఏదో ఒకటి అనేవారు కదా ఏం అనట్లేదంటే.. నేను చెప్పింది కరెక్ట్ అనే కదా అని ముకుంద అంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారీలు ఆ రింగ్ మార్చుకుంటారు. కానీ మధుకి మాత్రం ముకుందకి ఇదంతా ఇష్టం లేకనే ఇలా చేసిందని అనుకుంటాడు.

ఆ తర్వాత ముకుంద చాలా మారిపోయిందని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు నేను కృష్ణని మోసం చెయ్యలేక ఆదర్శ్ కి న్యాయం చెయలేకపోతున్నానని ముకుంద అనుకుంటుంది. అప్పుడే తన దగ్గరికి ఆదర్శ్ వస్తాడు. సారీ నిన్ను హర్ట్ చేశానని ముకుంద అనగానే.. లేదు నువ్వు చాలా మంచి పని చేసావ్.. నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం నా అదృష్టమని ఆదర్శ్ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అది చూసి ముకుంద తనని మోసం చేస్తున్నానని ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో రేవతి డల్ గా ఉంటుంది. అప్పుడే కృష్ణ, మురారి ఇద్దరు రేవతి దగ్గరికి వచ్చి.. ఏమైందని అడుగుతారు. శోభనం ముహూర్తం పెట్టిద్దాం అక్క అని అడిగితే.. ఇప్పుడే ఆదర్శ్, ముకుందలకి వద్దు కావాలంటే కృష్ణ మురారిలకి పెట్టుకోమని భవాని అక్క అంటుందని వాళ్ళకి రేవతి చెప్తుంది. ఆ తర్వాత రేవతి, కృష్ణ ఇద్దరు వెళ్లి నిజంగా ముకుంద మారిపోయిందని భవానికి చెప్తారు. వాళ్ళు ఎప్పటికి సంతోషంగా ఉండాలని నేను వాళ్ళకి ఇప్పుడు శోభనం వద్దని అంటున్నా కావాలంటే.. మీకు ముహూర్తం పెట్టించమను అని భవాని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.