English | Telugu

Krishna Mukunda Murari:‌మురారి మళ్ళీ డ్యూటీలో‌ జాయిన్ అవ్వగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -344 లో.. ఎక్కడ నిజం బయటపడి పెళ్లి ఆగిపోతుందోనని ముకుంద భయపడుతుంటుంది. అప్పుడే ముకుంద దగ్గరికి భవాని వచ్చి.. ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతుంది. ఏం లేదు మురారికి గతం గుర్తుకు వచ్చింది. నాకు అన్యాయం జరుగుతుందేమోనని భయంగా ఉందని ముకుంద అంటుంది. భయం ఎందుకు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు కదా.. తప్పు చెయ్యనిదే జైలుకీ ఎందుకు వెళ్తాడని భవాని అనగానే.. పెళ్లి అయ్యాక ఒకవేళ కృష్ణ వాళ్ళు ఏమి తప్పు చేయలేద తెలిస్తే అని ముకుంద అంటుంది. అవన్నీ ఏమి ఆలోచించకని భవాని చెప్తుంది.

ఆ తర్వాత మీరు అన్ని చూసుకుంటారు. నాకు ఇక టెన్షన్ ఎందుకని ముకుంద వెళ్ళిపోతుంది. నేను చూసుకుంటానని ముకుంద దైర్యంగా ఉంది. నేను అనుకున్నవి ఏమి జరగట్లేదు. మురారిని అమెరికా పంపించాలి అనుకున్నా అవ్వలేదు.. కృష్ణని ఇంట్లో నుండి పంపించాలని అనుకున్నాను. ఇది అవలేదు. అన్ని కృష్ణకి ఫేవర్ గా అవుతున్నయని భవాని అనుకుంటుంది. మరొకవైపు కృష్ణ, మురారి ఇద్దరు హాస్పిటల్ కి వెళ్లి పరిమళ మేడమ్ ని కలుస్తారు. జరిగిందంతా చెప్పి నన్ను సర్జరీ కోసం తీసుకోని వచ్చింది ఎవరని మురారి అడుగుతాడు. శేఖర్ అనే వ్యక్తి తీసుకోని వచ్చాడు. అంతే డీటెయిల్స్ ఏమి చెప్పలేదని పరిమళ చెప్తుంది. సీసీ టీవీ ఫుటేజ్ లో చూడండని మురారి అంటాడు. కానీ సీసీ టీవీ ఫుటెజ్ ఆ ఒక్క రోజుది తప్ప మిగతా రోజులవి ఉన్నాయి. ఎవరో పక్కా ప్లాన్ తో ఇదంతా చేశారని మురారి అనుకుంటాడు. పరిమళ మేడమ్ స్టాఫ్ ని పిలిచి అడుగుతుంది. అ రోజు సీసీ టీవీ రిపేర్ లో ఉందని చెప్తాడు. కాసేపటికి మురారి, కృష్ణ ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు.

మరొకవైపు పెళ్లి నగలు సెలెక్ట్ చెయ్యడానికి భవాని మేడమ్ ఇంటికి రమ్మన్నారని సేట్ నగలు ఇంటికి పట్టుకొని వస్తాడు. ఆ తర్వాత ముకుంద, భవాని ఇద్దరు నగలు సెలక్షన్ చేస్తుంటారు. అక్కడే ఉన్న రేవతిని ఎలా ఉన్నాయని అడుగగా.. బాగాలేదని చెప్తుంది. మరి నువ్వు సెలెక్ట్ చెయ్ అని భవాని అనగానే.. తనకి ఇష్టం లేకున్నా రేవతి సెలెక్ట్ చేస్తుంది. ఇక ముకుంద కూడ ఇష్టం లేకున్నా రేవతి సెలక్షన్ చేసింది కాబట్టి నచ్చిందని చెప్తుంది. కాసేపటికి శకుంతల దగ్గరికి రేవతి వస్తుంది. మురారి ఎలాగైనా మా అయన ఏం తప్పు చెయ్యలేదని నిరూపిస్తాడని శకుంతల చెప్తుంది. మరొకవైపు కృష్ణ, మురారి ఇద్దరు వెళ్లి కమీషనర్ ని కలుస్తారు. జరిగిందంతా చెప్తారు. మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతానని అనగానే రెండు నెలలు కన్పించకుండా ఉండి రూపం మారి వస్తే చాలా కాంప్లికేటెడ్ అవుతుందని కమీషనర్ అంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.