English | Telugu

'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' రెడీ అన్న ఆర్పీ

జబర్దస్త్ కమెడియన్ గా కిర్రాక్ ఆర్పీ ఒకప్పుడు ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఐతే తర్వాత షో నుంచి నాగబాబు వెళ్లిపోయేసరికి ఆర్పీ కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఒక మూవీ తియ్యడానికి ట్రై చేసాడు కానీ దాని డీటెయిల్స్ ఏమీ తెలీదు.

ఇక జబర్దస్త్ గురించి సోషల్ మీడియాలో ఆర్పీకి మిగతా జబర్దస్త్ టీమ్ మెంబర్స్ కి బాగా గొడవలు కూడా జరిగాయి. అలా ఆర్పీ టీవీ షోస్ కి గుడ్ బై చెప్పేసి కొన్ని వెబ్ సిరీస్ లో నటించాడు. ఎక్కడా స్థిరంగా ఉండని ఆర్పీ ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నాడు. రెస్టారెంట్ బిజినెస్ లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. కూకట్ పల్లిలో "నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో రీసెంట్ గా ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసాడు ఆర్పీ.

ఈ నెల్లూరు పెద్దారెడ్డి రెస్టారెంట్ ప్రత్యేకతల గురించి ఆర్పీ మాట్లాడుతూ.. ఈ రెస్టారెంట్ లో అన్ని వంటకాలు కట్టెల పొయ్యి పైనే వండుతామని.. పదేళ్ల కిందటే మొదలు పెడదామనుకున్న రెస్టారెంట్ కల ఇప్పటికి నెరవేరిందని చెప్పాడు. ఇదిలా ఉండగా.. కిరాక్ ఆర్పీ ఊరు నెల్లూరు అని తెలిసిన విషయమే. నెల్లూరు చేపల పులుసు అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆ రుచిని హైదరాబాద్ వాసులకు అందించాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసినట్లు చెప్పాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.