English | Telugu

పృద్వి - విష్ణు మధ్యకు శ్రీముఖి...మేమిద్దరి పార్టీకి వెళ్తే ఓకేనా

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో మొత్తం పార్టీ థీమ్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. పార్టీ థీమ్ అనేసరికి ఎలా ఉంటుంది...ఫుల్ రంగు రంగుల కాస్ట్యూమ్స్ తో మంచి జోష్ తో వచ్చారు అంతా. శ్రీముఖి కూడా కిర్రాక్ కాస్ట్యూమ్ తో వచ్చింది. "పార్టీ ఉంటుంది పుష్ప" అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి. తేజస్విని మడివాడ ఐతే అచ్చం పార్టీ వేర్ వేసుకుని గాగుల్స్ పెట్టుకుని వచ్చేసరికి "పార్టీ మొత్తం నీలోనే కనిపిస్తోంది" అంటూ సెటైర్ వేసింది శ్రీముఖి. "పార్టీ అమ్మాయిలు చేసుకుంటే బాగుంటుందా అబ్బాయిలు చేసుకుంటే బాగుంటుందా" అని అడిగింది. "అమ్మాయిలు లేకుండా అబ్బాయిలకు పార్టీలో ఎంట్రీనే లేదు" అని చెప్పింది తేజు. "పార్టీలో కొంత మంది అబ్బాయిలు వుంటారు గ్లాస్ పట్టుకుని యు అని వచ్చేస్తారు..అక్కడ కూర్చున్న అమ్మాయిల్లో ఎవరిని చూస్తే యు" అని చెప్పాలని ఉంది అంటూ అమరదీప్ ని అడిగింది శ్రీముఖి. "అందరికీ చెప్పాలనిపిస్తుంది వాడికి" అంటూ వెనక నుంచి నిఖిల్ ఆన్సర్ ఇచ్చాడు.

తర్వాత పృద్వి దగ్గరకు వచ్చి " అక్కడ ఉన్న విష్ణుని తీసేస్తే మిగతా అమ్మాయిల్లో నువ్వు ఏ అమ్మాయితో పార్టీ చేసుకుంటావ్" అని అడిగింది. దానికి పృద్వి వెంటనే శ్రీముఖి భుజం మీద చెయ్యేసి నీతోనే అని ఇన్డైరెక్ట్ గా చెప్పాడు. దానికి శ్రీముఖి "మేమిద్దరమే పార్టీకి వెళ్తే నీకు ఒకే నా" అంటూ విష్ణుని అడిగేసరికి ఆమె చాలా డల్ గా పెట్టింది ముఖం. ఈ మధ్య విష్ణు- పృద్వి ఆన్ స్క్రీన్ పెయిర్ గా బాగా హిట్ అయ్యారు. వీళ్ళ రిలేషన్ పెళ్లి వరకు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా మిగతా వాళ్ళు షోలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. మరి విష్ణు, పృద్వి రిలేషన్ ఎంత దూరం కంటిన్యూ అవుతుందో చూడాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.