English | Telugu

కర్రతో శోభాశెట్టికి క్లాస్ పీకిన నాగార్జున... యావర్ ఈజ్ బ్యాక్!

బిగ్ బాస్ సీజన్-7 లో శనివారం నాటి ప్రోమో కోసం కొన్ని లక్షల మంది జనాలు ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే వారం మొత్తం హౌస్ మేట్స్ చేసిన తప్పులని నిలదీస్తూ హోస్ట్ నాగార్జున క్లాస్ పీకుతాడు. కంటెస్టెంట్స్ కి నాగార్జున వార్నింగ్.. ఇది చూడటానికి మేమంతా సిద్ధం అన్నట్టుగా ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు.

ఇక ఎనిమిదవ వారం హౌస్ లో శోభాశెట్టి చేసిన పర్ఫామెన్స్ కి నాగార్జున గట్టిగా క్లాస్ పీకాలని అందరు భావించి ప్రతీ ప్రోమో కింద శోభాశెట్టికి నెగెటివ్ గా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే శనివారం నాటి ప్రోమో రానే వచ్చింది. నాగార్జున ఒక కర్ర తీసుకొని వచ్చి విరిచేశాడు. శోభాశెట్టిని లేపి.. గతవారం నామినేషన్‌లో భోలే ఎర్రగడ్డ అని అంటే గింజుకున్నావ్. మరి యావర్ ని పిచ్చోడు అని అనడం కరెక్టేనా..నీకు క్షమించే గుణం లేనప్పుడు నువ్వు మాటలు జారకూడదు కదా అని శోభాశెట్టికి వార్నింగ్ ఇచ్చాడు. నాకు యావర్ ఇచ్చిన రీజన్ వ్యాలిడ్ అని అనిపించలేదని శోభాశెట్టి అంది.

మొన్న కెప్టెన్సీ నుండి శోభాశెట్టిని యావర్ తప్పించినప్పుడు జరిగినది చూపించిన నాగార్జున.. " బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని ఎవరు అతిక్రమించకూడదు. బిగ్ బాస్ ప్రాపర్టీని నాశనం చేయకూడదనే రూల్ ఉంది కదా. ఆ వీడియో చూసిన నేనే కాదు ఆడియన్స్ కూడా నిన్ను పిచ్చోడని అనుకుంటారు. మళ్ళీ యూ ఆర్ బ్యాక్ టు ది వొరిజెనల్ బిహేవియర్" అని యావర్ తో అన్నాడు నాగార్జున.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.