English | Telugu

Karthika Deepam2 : నువ్వే అసలైన వారసురాలివి.. దీపకి నిజం చెప్పిన కార్తీక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -367 లో..... జ్యోత్స్న తనకున్న శాడిజంతో కార్తీక్ ని బానిసలాగా చేసుకొని తనకి నచ్చిన పని చేయించుకుంటుంది. అవన్నీ వీడియో తీసి దీపకి పంపిస్తుంది జ్యోత్స్న. దీప ఆ వీడియోస్ చూసి బాధపడుతుంది. ఏంటి అవి అని కాంచన కూడా వాటిని చూసి ఏడుస్తుంది. కార్తీక్ షూస్ క్లీన్ చేస్తున్న వీడియో చూసి కాంచన చాలా బాధపడుతుంది.

అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఏం చూస్తున్నారని అడుగుతాడు. నువ్వెందుకు అక్కడికి వెళ్ళావ్.. ఎందుకు ఇదంతా చేస్తున్నావని కాంచన బాధపడుతుంది. వాళ్ళకి అసలు నిజం చెప్పలేక కార్తీక్ ఇబ్బంది పడతాడు.ఆ తర్వాత దీపకి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. నేను అనుకున్నది సాధించానని గర్వం తో జ్యోత్స్న మాట్లాడుతుంది. బావని నా చుట్టూ తిప్పుకుంటున్నానని జ్యోత్స్న అంటుంటే దీపకి కోపం వస్తుంది.

మరుసటి రోజు కార్తీక్ ఇంటి నుండి బయటకు వెళ్తుంటే దీప అడ్డుపడుతుంది. ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు.. మీరు ఎక్కడికి వెళ్లొద్దని దీప అంటుంది. అసలు మీరు ఎందుకు ఆ పేపర్స్ పై సంతకం చేసారని దీప అంటుంది. నీ కోసం.. నిన్ను ఆ కుటుంబానికి దగ్గర చెయ్యడం కోసమని కార్తీక్ అంటాడు. నన్ను ఎందుకు దగ్గర చెయ్యడమని దీప అంటుంటే.. చెప్తానంటూ తనని కార్తీక్ పక్కకి తీసుకొని వెళ్తాడు. ఎందుకు అంటే నువ్వు నా మరదలివి.. సుమిత్ర దశరత్ ల సొంత కూతురివి.. అసలైన వారసురాలివి నువ్వే అని కార్తీక్ అనగానే.. దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.