English | Telugu

Brahmamudi: అటు కవి శోభనం.. ఇటు కావ్యకి రాజ్ ప్రపోజ్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -731 లో.....రాహుల్ కంగారుగా గదిలో నుండి బయటకు వస్తుంటే స్వప్న చూసి.. ఏంటి అలా చెమటలు పడుతున్నాయని అడుగుతుంది. తనకి డౌట్ వచ్చి తన నగలు చెక్ చేసుకుంటుంది అన్ని ఉన్నాయి.. మరి నువ్వు ఎందుకు అలా కంగారు పడుతున్నావని రాహుల్ ని స్వప్న అడుగుతుంది. నీకు నేను ఎలా కన్పిస్తున్నానంటూ రాహుల్ అడుగుతాడు. ఇక అతను ఏదో ఒకటి కవర్ చేస్తాడు.

మరుసటి రోజు రాజ్ కోసం అపర్ణ ఇందిరాదేవి వెయిట్ చేస్తారు. రాజ్ పంతులు గారు ఒకటే సారి వస్తారు. పంతులుని ఎందుకు తీసుకొని వచ్చావని ఇందిరాదేవి అడుగుతుంది. రాజ్ తీసుకొని రాలేదు నేను పిలిపించానని ధాన్యలక్ష్మి అంటుంది. ఎందుకని అందరు అడుగుతారు. శోభనం ముహూర్తం పెట్టడానికి అని ధాన్యలక్ష్మి అనగానే ప్రకాష్ సిగ్గుపడతాడు. ఈ వయసులో మీకెందుకు శోభనం.. అప్పు, కళ్యాణ్ కి అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇప్పుడే ఎందుకు మాకు కొంచెం టైమ్ కావాలని అప్పు అంటుంది. ఇక టైం లేదని ధాన్యలక్ష్మి ముహూర్తం పెట్టిస్తుంది. ఈ వంకతో కావ్య గారికి ప్రపోజ్ చెయ్యాలని రాజ్ అనుకుంటాడు.

ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరు రాజ్ ని పక్కకి తీసుకొని వెళ్లి అసలు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావని అడుగుతారు. అప్పు, కళ్యాణ్ శోభనం ఏర్పాట్లు చేసేటప్పుడు తనకి ప్రపోజ్ చేస్తానని రాజ్ అంటాడు. ఆ తర్వాత యామిని, రుద్రాణి ఫోన్ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.