English | Telugu

Karthika Deepam2 : కాశీని కొట్టేసిన కార్తీక్.. కాంచన కోసం దిగొచ్చిన శివన్నారాయణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -399 లో....జ్యోత్స్న చేసిన తప్పుని నిలదియ్యడానికి శివన్నారాయణ ఇంటికి కాశీ వెళ్తాడు. అక్కడ జ్యోత్స్నపై కాశీ కోప్పడతాడు. నేను చేసిన దానికి దీపకి సారీ చెప్పాను అయినా తృప్తి కాలేదు అనుకుంటా తమ్ముడిని రప్పించి మరి తిట్టిస్తుందని దీపపై అందరికి కోపం వచ్చేలా మాట్లాడుతుంది జ్యోత్స్న. నాకేం తెలియదు నేను కాశీని ఏం రమ్మన్నలేదని దీప అంటుంది.

అసలు ఆ జ్యోత్స్న ఇలా తయారు కావడానికి ఆ పెద్దాయన కారణం అని శివన్నారాయణ గురించి కాశీ తప్పుగా మాట్లాడుతుంటే ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని కాశీపై కోప్పడుతాడు కార్తీక్. దీప కూడా నువ్వు వెళ్ళు కాశీ అంటూ ఏడుస్తుంది. నీ కన్నీళ్లు కూడా ఈ ఇంట్లో పడడానికి అర్హత లేదు అక్క.. ఈ ఇంట్లో అందరు రాక్షసులు అని కాశీ అనగానే కాశీ చెంప పగులగొడుతాడు కార్తీక్. కాశీ ని కార్తీక్ బయటకు పంపిస్తాడు. నా కూతురు కావాలనే కాశీని రెచ్చ గొట్టిందని దశరత్ అనుకుంటాడు. ఆ తర్వాత మీరు కాశీని కొట్టి తప్పు చేసారని కార్తీక్ తో దీప అంటుంది. కానీ తప్పలేదని కార్తీక్ అంటాడు. ఫోన్ చేసి కాశీతో మాట్లాడండి అని దీప అంటుంది.

ఆ తర్వాత కార్తీక్, దీప ఇద్దరు కలిసి స్వప్న, కాశీలని కలిసి మాట్లాడతారు. కోపంలో అలా చేసానని కాశీతో కార్తీక్ అనగానే.. మీకు నన్ను కొట్టే అర్హత ఉందని కాశీ అంటాడు. మరొకవైపు కాంచనని చూడడానికి శివన్నారాయణ, జ్యోత్స్న కాంచన ఇంటికి వెళ్తారు. వాళ్ళతో మాట్లాడుతుంటే అప్పుడే దీప, కార్తీక్ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.