English | Telugu

Karthika Deepam2 : జ్యోత్స్న వాడిని కలవడం చూసేసిన పారిజాతం.. ఆ ఇంటికి వెళ్ళొద్దు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -349 లో.....కార్తీక్, దీప ఇద్దరు అసలు ఆ షూట్ ఎలా జరిగిందో అన్నివైపులా ఆలోచిస్తారు. ఒకవేళ జ్యోత్స్ననే షూట్ చేసి నీ లైఫ్ లోకి రావాలని ఇదంతా చేసిందేమోనని కార్తీక్ అంటుంటే నిజంగానే అలా జరిగే ఛాన్స్ ఉందా అని దీప అంటుంది. అదంతా తర్వాత ఆలోచిద్దాం కానీ నువు ఫస్ట్ పడుకో.. ఎన్ని రోజులు అవుతుందని కార్తీక్ అంటాడు.

మరుసటిరోజు జ్యోత్స్నని ఫాలో అవుతూ పారిజాతం వస్తుంది. జ్యోత్స్న ఎవరిని కలవడానికి వచ్చిందని పారిజాతం అనుకుంటుంది. తీరా చుస్తే జ్యోత్స్న దగ్గరికి సత్తిపండు వస్తాడు. బుల్లెట్ ఎందుకు మిస్ చేసావ్.. అక్కడ బుల్లెట్ తగిలిన వాళ్ళు బాగున్నారు.. ఆ దీప ఇంటికి వచ్చింది.. ఇప్పుడు నువ్వు దొరికితే నాకు సంబంధం లేదని జ్యోత్స్న అంటుంది. చేయించింది మీరే కదా అని సత్తి పండు అంటాడు. ఈ డబ్బు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళమని జ్యోత్స్న అంటుంది. అసలు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారని పారిజాతం చూస్తుంది. వాడిని ఎందుకు కలిసింది.. దాస్, దశరథ్ లపై ఎటాక్ చేసింది అదే అని తెలిస్తే మాత్రం ఈ పారిజాతం అంటే ఏంటో చూపిస్తానని పారిజాతం అనుకుంటుంది.

మరొకవైపు సుమిత్ర ఇంటికి దీప వెళ్తానని అంటుంటే.. దీపని తిడుతుంది అనసూయ. నీకు ఇదంతా అవసరమా గౌతమ్ మంచివాడు కాదని జ్యోత్స్నకి తెలుసు.. వాళ్ళు అపుకుంటారు. నువ్వు వెళ్లి అందరిచేత తిట్లు తిన్నావని అనసూయ తిడుతుంది. జ్యోత్స్న తన బావని దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా గౌతమ్ తో చేతులు కలిపింది. గౌతమ్ మంచివాడు కాదు.. జ్యోత్స్న నన్ను అక్క అని పిలిచి తన ఇంట్లో చోటు ఇచ్చింది.. అందరు బాగుండాలి కార్తీక్ బాబు వాళ్ళు కలవాలని దీప అంటుంది. ఆ మాటలు అన్నీ కార్తీక్ వింటాడు. నువ్వు అనుకున్నది జరుగుతుంది కానీ ఇప్పుడు అయితే వాళ్ళ ఇంటికి వద్దని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.