English | Telugu

Karthika Deepam2 :దీప కోసం తండ్రిని కొట్టబోయిన కార్తీక్.. జ్యోత్స్న టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -347 లో.... దీప ఇంటికి వచ్చిందని తెలిసి శ్రీధర్ ని గది లోపల ఉంచి బయట డోర్ వేసి దీప దగ్గరికి వస్తుంది. దీపతో కావేరి మాట్లాడుతుంటే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. ఎప్పటిలాగే దీప ని నిందిస్తుంటాడు. ఎందుకు వచ్చారు దీప దగ్గరికి వెళ్లి కార్తీక్ కి విడాకులు ఇవ్వమని చెప్పి బాధపెట్టారు.. మళ్ళీ ఎందుకు వచ్చారని అనసూయ అంటుంది. అంటే దీప నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమనడానికి కారణం నువ్వా అని శ్రీధర్ తో కార్తీక్ అంటాడు.

మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా అని కార్తీక్ తిడతాడు. ఇప్పుడు నా కోడలికి సారీ చెప్పాలని కాంచన అనగానే నేను చెప్పనని శ్రీధర్ అంటాడు.. అనసూయ గారు మీరు వెళ్లి చీపురుకట్ట తీసుకొని రండీ అని కార్తీక్ అనగానే అనసూయ తీసుకొని వస్తుంది. ఇప్పుడు మీరు సారీ చెప్పకపోతే దానికి పని చెప్పాల్సి ఉంటుందని కార్తీక్ అనగానే శ్రీధర్ బయపడి సారీ చెప్తాడు. మరొకవైపు దీప ఏ తప్పు చెయ్యలేదని కార్తీక్ తన భార్యకి సపోర్ట్ చేసి బెయిల్ పై బయటకు తీసుకొని వచ్చాడని జ్యోత్స్న పారిజాతం ఇద్దరు దశరథ్ తో చెప్తారు.

దీప చెయ్యలేదేమో బుల్లెట్ తన గన్ లోనిది కాదని తేలింది కదా అని దశరథ్ అంటాడు. మరి ఆ అవసరం ఎవరికీ ఉంటుందని శివన్నారాయణ అంటాడు. ఏమో చెప్పలేం మొదట సుమిత్రపై ఎటాక్.. ఆ తర్వాత దాస్, దీప శౌర్యలపై ఎటాక్ జరిగింది కదా నాపై ఎటాక్ , సుమిత్ర పై ఎటాక్ చేసింది ఒక్కరేమోనని దశరథ్ అంటాడు. సుమిత్రపై ఎటాక్ చేసింది నేనే కానీ దశరత్ పై ఎటాక్ చేసింది మాత్రం నాకు తెలియదని పారిజాతం అనుకుంటుంది. ఏదైనా సరే ఎవరు షూట్ చేసారో తెలుస్తుందని దశరథ్ అంటుంటే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. మరొకవైపు దీప, కార్తీక్, శౌర్య, అనసూయ, కాంచన అందరు భోజనం చేస్తుంటారు. కార్తీక్, దీపలకి శౌర్య తినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.