English | Telugu

డాక్టర్ బాబు మ‌ళ్లీ వ‌చ్చేస్తున్నాడు.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ!

'కార్తీక దీపం' సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరను, సోషల్ మీడియాని షేకాడించేసిన సీరియల్ ఇది. ఈ సీరియల్ కి మెయిన్ పర్సన్స్ డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత. వీళ్ళు లేకపోయేసరికి సీరియల్ కి అర్థ‌మే లేకుండా పోయింది. ఇది తెల్సుకున్న డైరెక్టర్ ఇప్పుడు కొత్త కొత్త మలుపులతో సరికొత్తగా మళ్ళీ ఒక్కో పాత్రను ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు వంటలక్క మేకప్ వేసుకుని రీఎంట్రీ ఇచ్చేసింది. ఆ ప్రోమో ఇప్పుడు బుల్లితెర మీద సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. నెగటివ్ రోల్ లో ఉండే మోనిత కూడా మళ్ళీ రావడానికి సిద్ధమౌతోంది.

ఇక డాక్టర్ బాబు కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని నిరుపమ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా అనౌన్స్ చేసేశాడు. "గెట్ రెడీ ఫోక్స్.. డాక్టర్ ఆన్ డ్యూటీ" అంటూ కాప్షన్ పెట్టి తలకు కట్టు కట్టుకున్న ఫోటో ఒకటి పోస్ట్ చేసాడు. ఇక ఈ పోస్ట్ చూసిన ఫాన్స్ అంతా ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది మాత్రం ఈ సీరియల్ ఇప్పుడు ఎలాంటి ట్రాక్ లో నడవబోతోంది అనే విషయం పై చర్చోపచర్చలు చేస్తున్నారు. ఐతే గతంలో డాక్టర్ బాబు "ఇంక సీరియల్ లోకి మళ్ళీ రాను.. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళైపోయారు కదా. వాళ్లకు తండ్రిగా చేయడం ఇష్టం లేదు" అని తన యూట్యూబ్ ద్వారా తన ఫాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చారు.

ఐతే ఇప్పుడు రీఎంట్రీ ఇస్తూండేసరికి కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే, కొంతమంది మాత్రం 'అప్పుడు అలా చెప్పారు, ఇపుడు మళ్ళీ ఏమిటి' అంటున్నారు. ఇక ఈ రీఎంట్రీస్ తో 'కార్తీక దీపం' సీరియల్ రేటింగ్ మళ్ళీ పెరుగుతుందా ఇంతకుముందులా ఆడియన్స్ మళ్ళీ ఈ సీరియల్ ని ఆదరిస్తారా.. వేచి చూడాలి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.