English | Telugu

Karthika Deepam 2 : పారిజాతానికి శుభవార్త చెప్పిన శ్రీధర్.. కార్తీక్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -438 లో..... సుమిత్ర మాటలకి దీప బాధపడుతుంది. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న వచ్చి.. మళ్ళీ దీపని మాటలు అంటారు. అసలు నీ వాలకం చూస్తుంటే నువ్వే కావాలని తాళి తెంపుకున్నట్లున్నావని పారిజాతం అంటుంది. వెనక్కి తిరిగి చూసేసరికి కార్తీక్ ఉంటాడు. కార్తీక్ ని చూసి పారిజాతం భయపడి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత శ్రీధర్ పెళ్లికి రానని చెప్పడంతో కార్తీక్ డల్ గా ఉంటాడు. కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. ఏంటి బావ గెలవబోయే ముందు మొహం ఇలా ఉండదు కదా అని అంటుంది. దీప వచ్చి.. మీ నాన్న దగ్గరికి వెళ్ళారు కదా బావ ఏమన్నారని అడుగుతుంది. సాయం కోసం వెళ్ళాం కదా చులకనగానే ఉంటుంది.. రానని చెప్పాడని దీపతో చెప్తాడు కార్తీక్.

ఆ తర్వాత పారిజాతం పక్కకి వచ్చి నోటిదూల ఆ కార్తీక్ గాడు ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో అనుకుంటుంది. అప్పుడే శ్రీధర్ ఫోన్ చేస్తాడు. అత్తయ్యగారు మీ గుడ్ న్యూస్ అని చెప్తాడు. ఏంటి అల్లుడు అని పారిజాతం అడుగుతుంది. కార్తీక్, కాంచన వచ్చారు పెళ్లికి రమ్మన్నారు రానని చెప్పాననీ శ్రీధర్ అనగానే పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫోన్ లోనే ఆనందంతో గట్టిగా అరుస్తుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. శ్రీధర్ గుడ్ న్యూస్ చెప్పాడని చెప్తుంది. నీకు ఇప్పుడు తెలిసిందా నాకు బావ మొహం చూసినప్పుడే తెలిసిందని జ్యోత్స్న అంటుంది.

ఆ తర్వాత స్వప్న బ్యాగ్ తో తన పుట్టింటికి వస్తుంది. ఏంటి ఇలా వచ్చావని కావేరి అడుగుతుంది. అన్నయ్య పెళ్లికి నాన్న రాను అన్నారంట కదా.. నా అక్క పెళ్లికి మీ నాన్న రాను అన్నాడు.. నీతో కాపురం చెయ్యను అని మా అయన నన్ను గెంటేసాడని స్వప్న అంటుంది. అయినా సరే నా నిర్ణయంలో ఏం మార్పు ఉండదని శ్రీధర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నిజంగానే అల్లుడు నిన్ను పంపించేశాడా అని కావేరి అడుగుతుంది. లేదు యాక్టింగ్ అని స్వప్న చెప్తుంది.

ఆ తర్వాత పారిజాతం హుషారుగా దీప దగ్గరికి వచ్చి వాటర్ తీసుకొని రమ్మంటుంది. దీప తీసుకొని వస్తుంది. ఆ వాటర్ కార్తీక్ తాగుతాడు. ఇందాక నా భార్యని ఏమో అంటున్నావని అడుగగా.. అన్నాను.. ఏంటి భయమా అని పారిజాతం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.