English | Telugu

Karthika Deepam2: తన మాటలతో కాశీని మార్చేసిన జ్యోత్స్న.. శ్రీధర్ కి ముప్పు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -543 లో.. జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటుంటే అప్పుడే దీప వస్తుంది. నా కడుపులో బిడ్డకి ఏమైనా అయితే ఏం చేస్తానో తెలుసు కదా అని దీప వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత దీప వెళ్ళాక దీని సంగతి చెప్పాలని జ్యోత్స్న అనుకుటుంది. గ్రానీ నేను రమ్మంటున్నానని కాశీని తీసుకొని రా అని జ్యోత్స్న అనగానే కాశీ దగ్గరికి పారిజాతం వెళ్తుంది. ఒరేయ్ మీ అక్క రమ్మంటుందని తీసుకొని వెళ్తుంది.

కాశీ వెళ్ళగానే నువ్వు ఇంత చదువు పెట్టుకొని పీఏగా చెయ్యడమేంటి.. మీ మావయ్య నిన్ను డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఒకసారి నీ రెజ్యుమె పంపు అని జ్యోత్స్న అనగానే కాశీ పంపిస్తాడు‌ అది చూసి ఇంత మెరిట్ స్టూడెంట్ ఇలా పని చెయ్యడమేంటి.. మీ మావయ్య నిన్ను తక్కువ పోస్ట్ లో ఉంచాడు.. దానికి నీ భార్య సపోర్ట్ కూడా ఉందని కాశీ మనసులో శ్రీధర్ గురించి నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేలా జ్యోత్స్న మాట్లాడుతుంది. మీ మావయ్య నిన్ను పర్మినెంట్ డ్రైవర్ చేసేలా ఉన్నాడని జ్యోత్స్న అంటుంది. నేను మంచి జాబ్ ఇప్పిస్తాను చేస్తావా అని జ్యోత్స్న అనగానే శ్రీధర్, స్వప్న అవమానం గా మాట్లాడిన మాటలు గుర్తుచేసుకొని చేస్తానని కాశీ అంటాడు. ప్లాన్ సక్సెస్ అని జ్యోత్స్న అనుకుటుంది. మరొకవైపు సుమిత్రకి దశరథ్ జ్యూస్ తీసుకొని వస్తాడు. తాగమని రిక్వెస్ట్ చెస్తాడు. వాళ్ళ ప్రేమని చూసి దీప మురిసిపోతుంది.

ఆ తర్వాత కాశీ కార్ దగ్గర ఉండగా అప్పుడే శ్రీధర్, కార్తీక్ వస్తాడు. పైనుండి జ్యోత్స్న, పారిజాతం చూస్తారు‌ వాళ్ళకి శ్రీధర్ హాయ్ చెప్తాడు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం అవసరమా అని కార్తీక్ అనగానే నిజాలు బయట పడుతాయని తెలియదు కదా అని శ్రీధర్ అంటాడు. నిజాలు బయటకు రానివ్వనని జ్యోత్స్న అనుకుంటుంది. కాశీ కార్ తియ్ అనగానే కాశీ, జ్యోత్స్న అన్నమాటలు గుర్తుచేసుకుంటాడు. దాంతో కాశీ వంక జ్యోత్స్న జాలిగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.