English | Telugu

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.

మరొకవైపు కాశీ దగ్గరికి పారిజాతం, జ్యోత్స్న వస్తారు. ఒరేయ్ డ్రైవర్ వెళ్లి చాయ్ తాగి రా అని పారిజాతం అనగానే నేను డ్రైవర్ కాదని కాశీ అంటాడు. మరి ఏం అంటారు రా నువ్వు మీ మామ దగ్గర పనికి చేస్తున్నావ్.. అంత అవసరం ఏముంది రా.. ఏం డబ్బులు కావాలన్నా నన్ను అడగొచ్చు కదా అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న మాట్లాడుతుంటే మీరు మాట్లాడకండి ఇక నీ బాగోతం బయటకు రానుంది ఆఫీస్ లో నువ్వు చేసే తప్పుడు లెక్కల గురించి మావయ్య ఒక్కొకటికి బయటకు తీస్తున్నాడని కాశీ అనగానే జ్యోత్స్నకి చెమటలు పడుతాయి. మరొకవైపు అసలు జ్యోత్స్న ఆ ఇంటి బిడ్డ కాదని అనిపిస్తుంది ఎందుకంటే తన సొంత కంపెనీలోనే చాలా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసింది. వాటికి లెక్కలు కూడా లేవని కార్తీక్ తో శ్రీధర్ అంటాడు. తనే వారసురాలు కదా తనకే కదా ఆస్తులన్నీ మరి చెయ్యాలసిన అవసరం ఏముంది.. తను వారసురాలు కాదని నాకు డౌట్ వస్తుందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఇప్పుడు నువ్వు లెక్కలు అన్ని చెప్పి జ్యోత్స్నని తాత ముందు నిలబెట్టగలవా అని కార్తీక్ అనగానే కొంచెం టైమ్ పడుతుందని శ్రీధర్ అంటాడు.

ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటారు. కాశీ మాటలు గుర్తుచేసుకొని టెన్షన్ పడుతారు. అప్పుడే దీప వస్తుంది. డోర్ కొట్టి రావాలని లేదా అని పారిజాతం అనగానే డోర్ వేసి లేదని దీప అంటుంది. అంటే నీ గురించే నువ్వు మొన్నటిలాగా పడిపోతావేమోనని పారిజాతం అనగానే నా బిడ్డ జోలికి వస్తే నేను ఏం చేస్తానో తెలుసు కదా అని దీప అనగానే గతంలో శౌర్య విషయం లో జ్యోత్స్న తప్పు చేసినప్పుడు దీప కొట్టిన విషయం గుర్తుచేసుకుంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.