English | Telugu

స్పెషల్ గా తయారు చేయించిన బ్లూ టిక్ కేక్ తో ఫైమా

పటాస్ షో ద్వారా ఫైమా ఫేట్ మొత్తం మారిపోయింది. పటాస్ ఫైమాగా ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ 6 లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడున్న అందరికీ గట్టి పోటీ ఇచ్చింది. అంతే కాదు బిగ్ బాస్ ద్వారా మంచి రెమ్యూనరేషన్ ని సొంతం చేసుకోవడమే కాదు తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చాక బుల్లితెర మీద షోస్ తో దూసుకుపోతోంది. తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యింది. జబర్దస్త్ కి, శ్రీదేవి డ్రామా కంపెనీ దూరమైపోయింది. స్టార్ మా ఛానెల్ లో "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షోలో శ్రీముఖి సిస్టర్ గా సెటిల్ ఐపోయి ప్రతీ వారం ఆదివారం తెలుగు ఆడియన్స్ ని అలరిస్తోంది. ఫైమా తన ఇన్స్టాగ్రామ్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటుంది. ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవుతుంది.

ప్రశ్నలడిగితే సమాధానమిస్తుంది. పాటలు పాడమంటే కూడా పడేస్తుంది. అలాంటి ఫైమా కొన్ని రోజుల క్రితం తన కల గురించి ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. నిద్ర పోయి లేచాక చూస్తే ఇన్స్టాగ్రామ్ బ్లూ టిక్ పడిపోతే ఎంత బాగుంటుందో అనుకుంది. ఇలా అనుకుందో లేదో అలా నిజమైపోయింది. ఫైమా కూడా ఒక బ్లూ టిక్ కి ఓనర్ ఐపోయింది. ఆ ఆనందాన్ని తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది. బ్లూ టిక్ తో ఉన్న కేక్ ని తయారు చేయించుకుని అది పట్టుకుని ఫొటోస్ దిగి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్ లోడ్ చేసింది. "ఫైనల్లీ బ్లూ టిక్..థాంక్యూ సో మచ్ ఎవరీ వన్ అని కామెంట్ చేసింది. ఈ విషయం తెలిసిన ఫాన్స్ అంత ఫైమాని విష్ చేస్తున్నారు. "త్వరలో 1 మిలియన్ ఫాలోవర్స్ కి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...ఇలాంటి బ్లూ టిక్ కేక్ కూడా ఉంటదా అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే ఉండదు..మనమే తయారు చేయించుకోవాలి." అని చెప్పింది. "ఇది నాకు ఒక హ్యాపీ మూమెంట్..నేను అనుకుని రాకుండా సడెన్ గా ఫోన్ చూసినప్పుడు రావాలి అనుకున్నా..అనుకున్నట్టే ఈరోజు అది జరిగింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను" అనే వీడియో తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.