English | Telugu

స్టార్ హీరోలకు మార్క్స్ వేసిన ఫారినర్.. నిఖిల్‌పై ఫైర్ అవుతున్న ఫాన్స్!

నిఖిల్ విజయేంద్ర సింహ నార్త్ అమెరికా సొసైటీ సంబరాలను హోస్ట్ చేయడం కోసం యూఎస్ కి వెళ్ళాడు. అలా అక్కడ అప్ డేట్స్ ని రెగ్యులర్ గా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. రీసెంట్ గా నయాగరా ఫాల్స్ కి వెళ్లి అక్కడ వీడియో కూడా చేసి పెట్టాడు. అలాగే అక్కడ సన్ సెట్ ఎలా అవుతుందో చూపిస్తూ, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అనే విషయాల మీద కూడా వీడియోస్ అప్ లోడ్ చేస్తూ ఉన్నాడు. ఐతే ఇప్పుడు వెరైటీగా ఒక ఫారెనర్ దగ్గరకు వెళ్లి ఒక రీల్ చేసాడు. "నేను మీకు కొంత మంది టాప్ హీరోస్ ని చూపిస్తాను. వాళ్ళు ఇండియాలో బాగా పాపులర్. వాళ్లకు మీరు 1-10లో ఎన్ని మార్క్స్ ఇవ్వాలనుకుంటే అన్ని ఇవ్వండి" అని చెప్పేసరికి ఆమె కూడా ఓకే అంది.

అలా నిఖిల్ తన ఆండ్రాయిడ్ లో ఫొటోస్ చూపిస్తూ ఉండగా ఆమె మార్క్స్ ఇచ్చింది. చూద్దాం ఎవరెవరికి ఎన్ని మార్క్స్ ఇచ్చిందో.."అల్లు అర్జున్ - 10 , ప్రభాస్ - 6 , మహేష్ బాబు - 8 , పవన్ కళ్యాణ్ - 7 , విజయ్ దేవరకొండ - 8 , నాగ సౌర్య - 10 "..ఇలా మార్క్స్ ఇచ్చింది ఈమె.

ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసరికి నెటిజన్స్ కామెంట్స్ బాగా పెట్టారు.."తమ్ముడు..రాంచరణ్ ఎక్కడ.. మహేష్ బాబు ఫాన్స్ ఇక్కడ హర్ట్ అయ్యాము.. అల్లు అర్జున్ అంటే ఆమాత్రం ఉంటుంది. నాని, జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ ఫొటోస్ ఎక్కడ" అంటూ అడుగుతున్నారు. అలాగే "ఈ వీడియో డిలీట్ చెయ్యి...నువ్వు హైదరాబాద్ రా బ్రో.. నువ్వు ఎవరితోనో రేటింగ్ వేయించడమేమిటి.. అన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా చేయకు బ్రో" అంటూ హీరోస్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.