English | Telugu

నన్ను తట్టుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ?.. యాంకర్ రష్మీ

జబర్దస్త్ ఇక కొత్త ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ న్యూ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. కృష్ణ భగవాన్, ఖుష్బూ ఇద్దరూ కూడా కొత్తగా కనిపించబోతున్నారు. న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ ఈ షో కొత్తగా రాబోతోందన్న విషయం తెలుస్తోంది. "ఇక నుంచి జబర్దస్త్ కొత్తగా ఉండబోతోంది..ఎనర్జీ డబుల్, ఎంటర్టైన్మెంట్ డబుల్. ఎవ్రిథింగ్ డబుల్ " అంటూ ఖుష్బూ మంచి ఎలివేషన్ ఇచ్చింది. "ఇప్పటి వరకు జబర్దస్త్ ఆడియన్స్ లో ఉంది. ఇప్పుడు జబర్దస్త్ లో ఆడియన్స్ ఉన్నారు" అంటూ కృష్ణ భగవాన్ చెప్పారు.

"అన్ని డబులా" అని రష్మీ అనుమానంతో అడిగేసరికి "అన్ని డబుల్ ఐతే యాంకర్ కూడా డబుల్ అవ్వాలిగా" అంది జడ్జ్ ఖుష్బూ. " నన్ను తట్టుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా" అని రష్మీ అడిగింది. ఐతే ప్రోమో లాస్ట్ లో కొత్త జెంట్ యాంకర్ ని సైడ్ లుక్ లో చూపించారు. ఐతే ఆ కొత్త యాంకర్ సుధీర్ ఆ, మానస్ ఆ అన్నది చూపించలేదు. ఐతే నెటిజన్స్ మాత్రం కొంతమంది సుధీర్ అంటుంటే కొందరు మానస్ అంటూ మెసేజెస్ చేస్తున్నారు. ఐతే ఈ సీరియల్స్ టైమింగ్స్ ని మాత్రం మార్చలేదు. ఇక రష్మీకి జోడీ ఉండే కో-యాంకర్ ఎవరు అన్నది ఈ శుక్రవారం షోలో తెలిసిపోతుంది. మానస్ కళ్ళజోడు తీసి పెట్టే మ్యానరిజంతో సుధీర్ అన్న ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫాన్స్. ఇక జడ్జ్ గా శివాజీ వెళ్లిపోవడంతో ఈ కామెడీ షోకి జడ్జ్ గా కృష్ణ భగవాన్ గారే కరెక్ట్ అంటూ కూడా మెసేజ్ పెడుతున్నారు నెటిజన్స్.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.