English | Telugu

సుదీర్‌, రష్మీలపై నరేష్ కామెంట్స్..పళ్ళు రాలగొట్టిన రాంప్రసాద్


శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సమ్మక్క సారక్క కాన్సెప్ట్ తో రాబోతోంది. ఇక ఇందులో రష్మీ పెళ్లి విషయం బాగా హైలైట్ అయ్యింది. నాటీ నరేష్ సోదెమ్మ గెటప్ లో వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. "సోది సెబుతానమ్మా సోది" అంటూ వచ్చేసరికి రష్మీ "సూదమ్మ సూదమ్మా" అని పిలిచింది. "సూదమ్మా దారమమ్మా కాదె సోదెమ్మ" అంటూ కరెక్ట్ చేసాడు నరేష్. తర్వాత తన అరచేతిని చూపించి "నా పెళ్లెప్పుడవుతది" అని అడిగింది. "నీకు కాబోయే వాడు మహరాజులా ఉంటాడు. రాత్రయితే ఎవరికీ కనపడడు. జేబులో నుంచి పావురాలను తీస్తాడు. రాత్రయితే ఆ పావురాలను మంచింగ్ కి వాడుకుంటూ ఉంటాడు. నాకెందుకో వాడు కాకుండా ఇంకెవడో ఉన్నాడనిపిస్తుంది భవిష్యత్తులో" అని నరేష్ రష్మీ అరచేతిని చూసి జాతకం చెప్పాడు. దానికి రష్మీ తెగ సిగ్గుపడుతూ నవ్వేసింది. తర్వాత రష్మీ సీరియస్ గా "కొంతమంది చాల ఎక్స్ట్రాలు చేస్తున్నారు అందుకే నేను వాళ్ళ పళ్ళు రాలకొడదామనుకుంటున్నా" అంటూ రాంప్రసాద్ వైపు చూస్తూ చెప్పింది.

తర్వాత రాంప్రసాద్, నటీ నరేష్ చిత్రపటాలని ఏర్పాటు చేసి అందులో వాళ్ళ నోట్లో పళ్ళను రాళ్లతో కొట్టేలా ఒక ఫన్నీ గేమ్ ఆడింది, ఆడించింది. తర్వాత రష్మీ, ఇంద్రజ పళ్ళను రాంప్రసాద్ రాలగొట్టాడు. తర్వాత "జయహో భారత్..జై జవాన్ " పేరుతో ఒక ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అందులో సింధూర్ ఆపరేషన్ లో ఒక పార్టిసిపేట్ చేసిన ఒక జవాన్ కూడా ఈ స్టేజి మీదకు వచ్చాడు. అదిరే అభి టీమ్ అంతా కలిసి ఒక టాస్క్ చేశారు. ఇలా ఈ వారం ఈ ఎపిసోడ్ ఎంటర్టైన్ చేయబోతోంది.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.