English | Telugu

ఏకాభిప్రాయం  తెచ్చిన పెంట.. కీర్తికి మంట!


బిగ్ బాస్ హౌస్ లో 'టికెట్ టు ఫినాలే' రేస్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మొదటి లెవెల్ పూర్తి అయ్యే సమయానికి శ్రీసత్య, ఇనయా రేస్ నుండి తొలగిపోయిన విషయం తెలిసిందే. కాగా రేస్ లో‌ ఇంకా ఆరుగురు సభ్యులు ఉండగా 'జెండాల జగడం' టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో ఆరుగురు పాల్గొన్నారు. "అయితే ఇందులో నుండి నలుగురు మాత్రమే తర్వాతి లెవెల్ కి వెళ్తారు. వారు ఎవరో మీరే ఏకాభిప్రాయంతో ఎంపిక చేసుకోండి" అని బిగ్ బాస్ చెప్పగా,‌ అందరూ కొంతసేపు ఆలోచించారు.

అందురు కూడా "ఏకాభిప్రాయం వద్దు బిగ్ బాస్.. మీరే చెప్పండి" అంటూ కెమెరాలకి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఎవరికి వారు "మేము తర్వాత లెవెల్ కి వెళ్ళాలనుకుంటున్నాం" అని చెప్పారు. శ్రీహాన్ మాట్లాడుతూ "నన్ను ఏకాభిప్రాయంతో ఎవరన్నా తీసేస్తే ఎవడిని గెలవనివ్వను.. ప్లేట్లు అన్ని పగులగొడతాను" అని అన్నాడు. ఆ తర్వాత రేవంత్ కూడా నాది సేమ్ డైలాగ్ అంటూ అలాగే వార్నింగ్ ఇచ్చాడు. "కంటెస్టెంట్స్ అంతా ఏకాభిప్రాయం తీసుకోవడంలో విఫలం అయ్యారు కాబట్టి సంచాలకులుగా ఉన్న ఇనయా,శ్రీసత్య మీరు ఇద్దరు కలిసి ఏ నలుగురు అయితే తర్వాత లెవల్ కి వెళ్ళాలనుకుంటున్నారో ఏకాభిప్రాయంతో డిసైడ్ చేసుకొని చెప్పండి" అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికి "లీస్ట్ ఉన్న రోహిత్, ఇంకా కీర్తీలను రేస్ నుండి తొలగిస్తున్నాం బిగ్ బాస్" అని చెప్పారు.

దీంతో హౌస్ లో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. కీర్తీ, ఇనయాల మధ్య గొడవ జరిగింది. "కీర్తి.. మాకు వేరే ఆప్షన్ లేదు. అక్కడ లీస్ట్ లో ఎవరు ఉన్నా ఇలానే చేస్తాం" అని ఇనయా చెప్పగా, "గ్రేట్ డెసిషన్ " అంటూ కీర్తి వెటకారంగా అంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. చివరగా కీర్తి కంటతడి పెట్టగా, హౌస్ మేట్స్ వచ్చి ఓదార్చారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.