English | Telugu

Illu illalu pillalu : మిమిక్రీ చేసి ఆటపట్టించిన ప్రేమ.. కొత్త కోడలి బంగారు గాజులు తీసుకుందెవరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -33 లో..... నర్మద ప్రొద్దునే లేచి తులసి పూజ చేస్తుంది. ఆ తర్వాత రెడీ అవుతుంటే తన గాజులు కన్పించవు.. అదే విషయం సాగర్ ని పిలిచి నా బంగారు గాజులు కన్పించడం లేదని అంటుండగా.. అది రామరాజు విని వేదవతిని పిలుస్తాడు. ఎన్నడూ లేని విధంగా వస్తువులు పోవడమేంటి ఆ పిల్ల బంగారు గాజులు పోయాయట అని రామరాజు అనగానే.. ఇంతవరకు ఈ ఇంట్లో ఒక వస్తువు కూడా పోలేదని వేదవతి అంటుంది.

అప్పుడే రామరాజు పెద్ద కూతురు నిద్ర లేచి వస్తుంది. తన చేతికి గాజులు చూసి అవి నావే అని నర్మద అంటుంది. ఆ గాజులు ఎవరివి అని వేదవతి కామాక్షిని అడుగగా.. తనవే ఆడపడుచు కట్నం ఇవ్వలేదు కదా తేరగా వచ్చేసిందని కామాక్షి అనగానే.. తనవి తనకు ఇచ్చేయ్.. నీకు అలాంటివి తీసుకొని వస్తానని రామరాజు అనగానే కామాక్షి ఇస్తుంది. ఆ తర్వాత వేదవతి పూజ చేసి హారతి ఇస్తుంది. నర్మద సాగర్ లకి ఇవ్వదు. దాంతో సాగర్ కి నర్మద హారతి ఇస్తుంది. రామరాజు మిల్ కి వెళ్తాడు. నన్ను తీసుకొని వెళ్లడం లేదని సాగర్ ఫీల్ అవుతాడు. అయినా వద్దని చెప్పలేదు కదా.. వెళ్ళమంటూ సాగర్ ని పంపిస్తుంది నర్మద.

ఆ తర్వాత ధీరజ్ కి వేదవతి ఫోన్ చేస్తుంది. అయినా ధీరజ్ లిఫ్ట్ చెయ్యడు. దాంతో వేదవతి బాధపడుతుంది. వేదవతి బాధపడడం నర్మద చూస్తుంది. మరొక వైపు ధీరజ్ గాడు బయట తిరుగుతున్నడని భద్రవతి మేనల్లుడు వచ్చి తనకి చెప్పగానే సంతోషపడుతాడు. ఎందుకిలా చేస్తున్నారు వేదవతి నీ చెల్లెలు అని వాళ్ళ అమ్మ అంటుంది. తరువాయి భాగంలో ధీరజ్ వెనకాల నుండి ప్రేమ వచ్చి రామారాజులాగా మిమిక్రీ చేస్తుంది. దాంతో నన్ను క్షమించండి నాన్న అంటూ ధీరజ్ భయపడతాడు. ధీరజ్ ని ప్రేమ ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.