English | Telugu

Illu illalu pillalu : మిమిక్రీ చేసి ఆటపట్టించిన ప్రేమ.. కొత్త కోడలి బంగారు గాజులు తీసుకుందెవరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -33 లో..... నర్మద ప్రొద్దునే లేచి తులసి పూజ చేస్తుంది. ఆ తర్వాత రెడీ అవుతుంటే తన గాజులు కన్పించవు.. అదే విషయం సాగర్ ని పిలిచి నా బంగారు గాజులు కన్పించడం లేదని అంటుండగా.. అది రామరాజు విని వేదవతిని పిలుస్తాడు. ఎన్నడూ లేని విధంగా వస్తువులు పోవడమేంటి ఆ పిల్ల బంగారు గాజులు పోయాయట అని రామరాజు అనగానే.. ఇంతవరకు ఈ ఇంట్లో ఒక వస్తువు కూడా పోలేదని వేదవతి అంటుంది.

అప్పుడే రామరాజు పెద్ద కూతురు నిద్ర లేచి వస్తుంది. తన చేతికి గాజులు చూసి అవి నావే అని నర్మద అంటుంది. ఆ గాజులు ఎవరివి అని వేదవతి కామాక్షిని అడుగగా.. తనవే ఆడపడుచు కట్నం ఇవ్వలేదు కదా తేరగా వచ్చేసిందని కామాక్షి అనగానే.. తనవి తనకు ఇచ్చేయ్.. నీకు అలాంటివి తీసుకొని వస్తానని రామరాజు అనగానే కామాక్షి ఇస్తుంది. ఆ తర్వాత వేదవతి పూజ చేసి హారతి ఇస్తుంది. నర్మద సాగర్ లకి ఇవ్వదు. దాంతో సాగర్ కి నర్మద హారతి ఇస్తుంది. రామరాజు మిల్ కి వెళ్తాడు. నన్ను తీసుకొని వెళ్లడం లేదని సాగర్ ఫీల్ అవుతాడు. అయినా వద్దని చెప్పలేదు కదా.. వెళ్ళమంటూ సాగర్ ని పంపిస్తుంది నర్మద.

ఆ తర్వాత ధీరజ్ కి వేదవతి ఫోన్ చేస్తుంది. అయినా ధీరజ్ లిఫ్ట్ చెయ్యడు. దాంతో వేదవతి బాధపడుతుంది. వేదవతి బాధపడడం నర్మద చూస్తుంది. మరొక వైపు ధీరజ్ గాడు బయట తిరుగుతున్నడని భద్రవతి మేనల్లుడు వచ్చి తనకి చెప్పగానే సంతోషపడుతాడు. ఎందుకిలా చేస్తున్నారు వేదవతి నీ చెల్లెలు అని వాళ్ళ అమ్మ అంటుంది. తరువాయి భాగంలో ధీరజ్ వెనకాల నుండి ప్రేమ వచ్చి రామారాజులాగా మిమిక్రీ చేస్తుంది. దాంతో నన్ను క్షమించండి నాన్న అంటూ ధీరజ్ భయపడతాడు. ధీరజ్ ని ప్రేమ ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.