English | Telugu

గూగుల్ ని తల్లిని చేసింది ఆది అంటా..ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే!

కొన్ని జోక్స్ వింటే చాలు పడీపడీ నవ్వుకుంటాం.. కొన్ని జోక్స్ కి ఆటోమేటిక్ గా అలా మన ప్రమేయం లేకుండా కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఆ జోక్ ఏంటో తెలుసుకుంటే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు. శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే చాలు పొట్ట చెక్కలవ్వాల్సిందే. హోలీ రాబోతున్న సందర్భంలో హోలీ స్పెషల్ గా ఈ షోని రూపొందించారు. ఇక ఇందులో అందరూ మస్తుగా రంగులు పూసుకుని ఫుల్ ఛిల్ల్ అయ్యారు.

పండు డాన్స్ ఐతే వేరే లెవెల్ లో ఉంది. ఐతే ఇందులో రష్మీ వెరైటీగా ఒక సెగ్మెంట్ పెట్టింది. గూగుల్ ఏది అడిగిన చెప్తుంది కానీ ఒక్కోసారి గూగుల్ ఆన్సర్స్ చూస్తే పిచ్చ నవ్వు కూడా వస్తుంది. దాన్నే కాన్సెప్ట్ గా తీసుకుంది రష్మీ. "మన పేరును గూగుల్ లో కొట్టగానే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో చూద్దాం" అని చెప్పింది "గూగుల్ ఆది గురించి చెప్పు" అని వాయిస్ మెసేజ్ లో ఆది గురించి రష్మీ అడిగింది. "అందరూ నన్ను గూగుల్ తల్లి అంటూ ఉంటారు కదా.. నన్ను తల్లిని చేసిందే వాడు" అని గూగుల్ అసిస్టెంట్ ఆన్సర్ ఇచ్చేసరికి స్టేజి మీద నవ్వులే నవ్వులు. "గూగుల్ తల్లినే తల్లిని చేశారా" అని రష్మీ అడిగేసరికి.."అప్పుడు నేను తిరిగేవాడు కూడా మీ వాడి లాగే ఉండేవాడు..మీవాడే " అంటూ సుడిగాలి సుధీర్ ని కామెంట్ చేసేసరికి రష్మీకి కోపం వచ్చేసింది. తర్వాత ఆది వాయిస్ మెసేజ్ లో "గూగుల్ తల్లి ఇంద్రజ గారు చూడడానికి ఎలా ఉంటారు" అని అడిగాడు. " చూడడానికి ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు.. ఏరా ఆది ఏమంటావ్" అని గూగుల్ చెప్పేసరికి వ్వాహ్ అన్నాడు ఆది. ఇలా నెక్స్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.