English | Telugu

అన్నయ్యా అన్నందుకు శ్రద్దా మీద ఆది ఫైర్!

ఢీ ఛాంపియన్ షిప్ బ్యాటిల్ సీజన్ 15 క్వార్టర్ ఫైనల్స్ మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ వారం కూడా కంటెస్టెంట్స్ పోటా పోటీగా డాన్స్ చేశారు. ఇందులో ఆది, శ్రద్దా మీదా ఫైర్ అయ్యాడు. "నీ కాళ్ళను పట్టుకు" సాంగ్ ని శ్రద్దా చాలా అద్భుతంగా పాడి వినిపించింది. దానికి ఫిదా ఐన ఆది వెంటనే "ఎందువల్ల నిను ప్రేమించానో" అంటూ పాడి సమాధానం ఇచ్చాడు. "ఇప్పటివరకు ఈ ఫుల్ సీజన్ లో మీకు ఏమీ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆ విషయం చెప్తాను. ఈ రోజు నుంచి ఆది నా అన్నయ్య.." అనేసరికి జెస్సి క్లాప్స్ కొట్టాడు. బ్యాక్ గ్రౌండ్ లో "అన్నయ్యా అన్నావంటే" అనే సిట్యుయేషనల్ సాంగ్ ని ప్లే చేశారు. "బయట నేను ఏదైతే అనుకుని వచ్చానో అదంతా వీళ్ళు మార్చేశారు" అని ఆది ఫీలయ్యాడు.

అది తట్టుకోలేక "ఎవరి దగ్గరైన ఫోన్ ఉంటే ఇవ్వండి ప్రియాకి కాల్ చేస్తాను"..."శేఖర్ మాష్టర్" అని ఆది పిలిచేసరికి "చెప్పు బామ్మర్ది" అన్నాడు శేఖర్ మాష్టర్. "ఫోన్ ఉంటే ఇవ్వండి ప్రియమణికి కాల్ చేస్తాను" అన్నాడు. "మరి దివ్య ఏమైపోతుంది" అంది శ్రద్దా. "దివ్య లేదు ఎం లేదు ముందు ప్రియమణి గారికి కాల్ చేయండి" అన్నాడు "ఫామిలీ మొత్తం ఇలా కలవడం ఎలా ఉంది" అని ప్రదీప్ అడిగేసరికి నాకు ఎలాంటి ఫ్యామిలీ లేదు నన్ను ఇలా వదిలేయండి" అన్నాడు. శ్రద్దా తన సీట్ లోంచి లేచి "ఆది..ఇది జస్ట్ కంటెంట్ మాత్రమే.." అనేసరికి సీరియస్ గా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆది. "శ్రద్దా నువ్వు నన్ను టచ్ చేయొద్దు చాలా చిరాగ్గా ఉంది.. నా పక్కన కూర్చుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి నిజంగానే వెళ్ళిపోయాడు..ఆది అలా బయటికి వెళ్లి వేరే అమ్మాయిని తీసుకొచ్చి తన పక్కన సీట్ లో కూర్చోబెట్టాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.