English | Telugu

హీరోయిన్ శ్రీలీలపై మనసు పారేసుకున్న హైపర్ ఆది!

"ధమాకా" మూవీ హీరోయిన్ శ్రీలీల మీద మనసు పారేసుకున్నాడు హైపర్ ఆది. ఆమెపై ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఇది. ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ తో ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కాబోతుంది.

ఇప్పుడు రీసెంట్ గా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ మూవీలో హైపర్ ఆది ఒక పాత్రలో నటించాడు. ఆయన స్టేజి మీద హీరో రవితేజ గురించి మాట్లాడాక హీరోయిన్ శ్రీలీల మీద హాట్ కామెంట్స్ చేసాడు. “సినిమాలో శ్రీలీల నటన పీక్స్ లో ఉంటుంది అందరికి నచ్చుతుంది. బేసిగ్గా లవర్ లేనివాడు ఈ సినిమా చూస్తే.. శ్రీలీల లాంటి లవర్ ఉంటే బాగుండు అనుకుంటాడు. లవర్ ఉన్నోడు ఈ అమ్మాయిని చూస్తే ఇలాంటి లవర్ ఉన్నా బాగుండేది" అని అనుకుంటాడు. "ఎవరికైనా శ్రీలీలని చూస్తే అలాగే అనిపిస్తుంది..నాకూ అంతే.

తెలుగులో ఇంత మంచి ఆర్టిస్ట్ దొరకడం మామూలు విషయం కాదు. రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు అందుకుంటుంది అనిపిస్తుంది” అంటూ శ్రీలీలని ఆకాశానికెత్తేసాడు హైపర్ ఆది. టీనేజ్ లోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీలీల.. ‘పెళ్లి సందడి’ మూవీతో తెలుగులో డెబ్యూ చేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.