English | Telugu

సౌమ్యరావు, నేను ఒకరి తర్వాత మరొకర్ని వరసగా కంటాం!

'జబర్దస్త్'ఖతర్నాక్ కామెడీ షో మొదట్లో అలాగే ఖతర్నాక్ గా అలరించేది. ఐతే రాను రాను కమెడియన్స్ అందరూ ముదిరిపోయి ఎక్స్ట్రా పంచులు, ఎక్స్ట్రా డైలాగ్స్ వేస్తూ వెకిలిగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చిన నెగటివ్ కామెంట్స్ కారణంగా మళ్ళీ కాస్త దారిలోకి వచ్చింది ఈ షో. ఈ షోకి సంబంధించి యాంకర్స్, జడ్జెస్ విషయానికి వస్తే మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ ఆడియన్స్ కి పరీక్ష పెట్టారు నిర్వాహకులు.

చివరికి జబర్దస్త్ కి కొత్త యాంకర్ ని పట్టుకొచ్చారు. తెలుగు, కన్నడ సీరియల్స్ చేసిన సౌమ్య రావుని తీసుకొచ్చారు.. వచ్చి రాని తెలుగుతో అందరినీ ఆడేసుకుంటోంది సౌమ్య. రావడంతోనే హైపర్ ఆదిపై వరస పంచులేసింది.

ఈ వారం కూడా ఆది తన మార్క్ పిచ్చి డైలాగ్స్ తో రెచ్చిపోయాడు. ఈ షో లేటెస్ట్ ప్రోమో చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ‘ప్రపంచంలో అందరూ చనిపోయి మీరిద్దరే మిగిలితే ఏం చేస్తారు’ అని జడ్జి కృష్ణ భగవాన్.. హైపర్ ఆది, సౌమ్యని ఉద్దేశించి ఒక కామెడీ ప్రశ్న అడిగారు. దీనికి హైపర్ ఆది.. తామిద్దరం కలిసి ఓ ప్రపంచాన్ని సృష్టిస్తాం అని, వరసగా ఒకరి తర్వాత మరొకరిని కంటాం" అని చెప్పి పిచ్చి కామెడీ చేసాడు. ఇక ఆది డైలాగ్స్ కి ఎలా స్పందించాలో అర్ధంకాక పక్కనే ఉన్న సౌమ్య తలదించుకుని ఒక నవ్వు నవ్వేసింది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.